Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'రాజకీయాలు, మహిళలు, విద్యార్థులు, ప్రేక్షకులకు కావాల్సిన ఆసక్తికర అంశాలు, వార్తలు, విశేషాలు, వినోదానికి కేరాఫ్గా నిలవాలనే లక్ష్యంతో మా 'రెడ్డీస్ మల్టీప్లెక్స్'ని ఆరంభిస్తున్నాం' అని శైలజా చరణ్ రెడ్డి అన్నారు.
పొలిటికల్ ప్రియులకు పొలిటికల్ ఛానల్, మహిళల కోసం మహిళా ఛానల్, స్టూడెంట్స్కి ఎడ్యుకేషనల్ ఛానల్, సినిమా ప్రేక్షకులకి 'ఆర్ - ఫ్లెక్స్' ఓటీటీిని ఇలా ఎన్నో సరికొత్త ఛానెల్స్ని అంగరంగ వైభవంగా హైదరాబాద్లోని పార్క్ హయాత్ హౌటల్ లో అతిధుల సమక్షంలో గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అనంతరం నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ, 'మహిళలకి అవకాశం ఇస్తే ఎంత ఎత్తుకైనా ఎదుగుతారు అనే దానికి నిదర్శనమే శైలజ చరణ్ రెడ్డి. యూట్యూబ్ ఛానల్, ఓటిటి సినిమాలు, టీవీ ఛానల్.. ఇవన్ని చాలా రిస్క్తో ఉండే వ్యాపారాలు, మా శైలజ రెడ్డికి ధెర్యం ఎక్కువ. ఈ రంగంలోనూ ఆమె మంచి విజయం సాధించాలి' అని తెలిపారు. దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి మాట్లాడుతూ, 'ఈ 'రెడ్డీస్ ముల్టీప్లెక్స్' నేటి యూత్కి మంచి వేదిక అవుతుంది. సినిమాలు, యూట్యూబ్ ఛానల్, రియల్ ఎస్టేట్ అని మంచి పద్ధతితో చేస్తున్నారు' అని చెప్పారు. 'రెడ్డీస్ మల్టీప్లెక్స్' అధినేత్రి శైలజ చరణ్ రెడ్డి మాట్లాడుతూ, 'ఈ రంగం నాకు కొత్త అయినప్పటికీ విజయం సాధిస్తాననే నమ్మకం నాకుంది. ఈ రెడ్డీస్ ముల్టీప్లెక్ కులం, మతం, ఏ రాజకీయానికి సంబంధించింది కాదు కానీ రెడ్డి అంటే అందరికి మంచి చేసేవాడు, అందరినీ రక్షించేవాడు అని ఈ పేరు పెట్టాం. నేటి యూత్కి కావాల్సిన అని హంగులు మా యూట్యూబ్ ఛానెల్స్లో ఉంటాయి. యూట్యూబ్ ఛానల్ అంటే అందరికి చిన్న చూపు ఉంది. కాని ఇప్పటి శాటిలైట్ ఛానెల్స్ కన్నా యూట్యూబ్ ఛానల్ ఎక్కువగా రాణిస్తున్నాయి. ఆర్ - ఫ్లెక్స్ ఓటిటి ద్వారా అని భాషల్లో సినిమాలు చేస్తాం. రియల్ ఎస్టేట్లో పేద వాళ్ళకి సహాయంగా తక్కువ ధరతో అందరికి ఇళ్ళు ఇవ్వాలని ఆశిస్తున్నాం. త్వరలోనే శాటిలైట్ ఛానల్ని కూడా ప్రారంభిస్తాం' అని తెలిపారు.
'రెడ్డీస్ ముల్టీప్లెక్ ప్రారంభించిన శైలజ, విజరు రెడ్డికి శుభాకాంక్షలు. ఈ రంగంలో వారు విజయం సాధించాలి. టాలెంట్ ఉన్నవారికి అవకాశం ఇవ్వాలని ఆశిస్తున్నాను' అని ఎం.పి.మధు యాష్కీ గౌడ్ చెప్పారు. విజరు రెడ్డి మాట్లాడుతూ,'టాలీవుడ్ అనేది ఒక చేపల చెరువు. కానిప్పుడు ఆన్లైన్ అనే మహా సముద్రం ఆ చేపల చెరువును మిగేసింది. ఇప్పుడు ప్రపంచం అంతా యూట్యూబ్, ఓటీటీలనే చూస్తుంది. మా ఛానెల్స్ ద్వారా కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తాం. ఎవరి దగ్గరైన మంచి కథ ఉండి, డైరెక్షన్ చేయగల టాలెంట్ ఉంటే మేం అవకాశం ఇస్తాం' అని చెప్పారు. ఈ 'రెడ్డీస్ మల్టీప్లెక్స్' ప్రారంభోత్సవంలో నరసింహరెడ్డి, విద్యావతి, అవినాష్ రెడ్డి, రవి చంద్ర రెడ్డి, స్నేహ, బియగూడ హరీష్ తదితరులు పాల్గొన్నారు.