Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రానా, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం 'విరాటపర్వం'. 'నీది నాది ఒకే కథ' ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డి. సురేష్బాబు సమర్పణలో శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఒక చిన్న షెడ్యూల్ మినహా ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. బ్యాలెన్స్ వర్క్కి సంబంధించి ఇటీవలే చిత్రీకరణ పునఃప్రారంభమైంది.
'రాత్రి వేళల్లో ఈ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్లో రానా కూడా పాల్గొంటున్నారు. ఒక విభిన్న తరహాతో, కంటెంట్ ప్రధానంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ చేయని పాత్రలను రానా, సాయిపల్లవి పోషిస్తున్నారు.ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావు, సాయిచంద్ ముఖ్య పాత్రధారులుగా నటిస్తున్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం సమకూరుస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.
ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజరు కుమార్ చాగంటి, సినిమాటోగ్రఫీ: డానీ సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర, స్టంట్స్: స్టీఫెన్ రిచర్డ్, పీటర్ హెయిన్, కొరియోగ్రఫీ: రాజు సుందరం, నిర్మాత: సుధాకర్ చెరుకూరి, సమర్పణ: డి. సురేష్ బాబు, రచన-దర్శకత్వం: వేణు ఊడుగుల.