Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కి ఘన విజయం సాధించిన తమిళ చిత్రం 'కొలమావు కోకిల'. 'కో..కో..కోకిల'గా ఈ చిత్రం తెలుగులోనూ విడుదలై మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రాన్ని జాన్వీ కపూర్ ముఖ్య పాత్రలో బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సిద్థార్థ్ సేన్ గుప్తా దర్శకత్వంలో ఆనంద్.ఎల్.రారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జవనరి 9 నుంచి పంజాబ్లో ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం కానుంది. జాన్వీ ప్రస్తుతం 'రూహీ ఆఫ్జా', 'దోస్తానా 2' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.