Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెళ్ళి తర్వాత అగ్ర నాయిక కాజల్ తొలి సినిమాకి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. నెల రోజుల క్రితం స్నేహితుడు, ప్రియుడు గౌతమ్ కిచ్లుని పెళ్ళి చేసుకున్న కాజల్ తిరిగి సినిమా చిత్రీకరణల పనుల్లో బిజీ అయిపోయారు. ఇందులో భాగంగా దర్శకుడు డీకే దర్శకత్వంలో తెరకెక్కబోయే ఓ హర్రర్ సినిమాకి పచ్చ జెండా ఊపారు. ఈ సందర్భంగా కాజల్, కిచ్లుతో కలిసి తీసుకున్న ఫొటోను దర్శకుడు డీకే ఇన్స్టాలో షేర్ చేశారు. అంతేకాకుండా సినిమా ఖరారైందని, కాజల్-గౌతమ్తో జరిపిన సంభాషణ ఎంతో సరదాగా సాగిందని కూడా డీకే తెలిపారు. ఈ సినిమాలో నలుగురు కథానాయికలకు స్థానం ఉన్నట్టు తెలుస్తోంది. కాజల్తోపాటు నటించబోయే ఆ ముగ్గురు కథానాయికలు ఎవరనేది త్వరలోనే తెలియనుంది. ఇదిలా ఉంటే, కాజల్ ప్రస్తుతం ఈ సినిమాతోపాటు 'మోసగాళ్ళు', 'ఆచార్య', 'ముంబయి సాగా', 'భారతీయుడు 2' చిత్రాల్లోనూ నటిస్తున్నారు.