Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాహుల్, చేతన్, సాక్షి చౌదరి, ఐశ్వర్య, యమీ ముఖ్య పాత్రధారులుగా విరాట్ చక్రవర్తి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. శ్రీమతి దివిజా సమర్పణలో యస్.యస్ స్టూడియోస్, విజన్ సినిమాస్ పతాకం పై సాయి కార్తీక్, నాగం తిరుపతి రెడ్డి, శ్రీకాంత్ దీపాల ప్రొడక్షన్ నంబర్ 1 ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థ్రిల్లర్, కామెడీ నేపథ్యంలో ఉండే ఈ చిత్రం రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభ మైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మధుర శ్రీధర్ పూజ కార్యక్రమాలు నిర్వహించగా, చిత్ర నిర్మాతలలో ఒకరైన సాయి కార్తీక్ క్లాప్ కొట్టారు. నాగం తిరుపతి రెడ్డి కెమెరా స్విచాన్ చేేశారు. చిత్ర సహ నిర్మాత శ్రీకాంత్ దీపాల గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా సాయి కార్తీక్ మాట్లాడుతూ, 'ఇంతకాలం మ్యూజిక్ డైరెక్టర్గా చేసిన నేను మొదటి సారిగా ప్రొడక్షన్ రంగంలోకి వచ్చాను. ఇదొక డిఫరెంట్ ప్రాజెక్ట్. మ్యూజిక్ డైరెక్టర్గా ఆదరించినట్లే ప్రొడ్యూసర్గా కూడా నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను' అని చెప్పారు. 'ఇప్పటి వరకు నేను 3 సినిమాలు చేశాను. ఇది 4వ సినిమా. ప్రతి సంవత్సరం 2 సినిమాలు చేస్తాం' అని నిర్మాత నాగం తిరుపతి రెడ్డి అన్నారు. 'ఇది భిన్న థ్రిల్లర్ కామెడీ సినిమా. జనవరి చివరికల్లా ఈ చిత్రం పూర్తి చేస్తాం' అని దర్శకుడు విరాట్ చక్రవర్తి చెప్పారు. హీరో రాహుల్ మాట్లాడుతూ,'ఈ కథ విన్నప్పుడు చాలా థ్రిల్ అయ్యాను. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కూడా అంతే థ్రిల్ ఫీల్ అవ్వుతారు' అని అన్నారు. హీరో చేతన్ మాట్లాడుతూ, 'నేను ఇప్పటి వరకు కన్నడలో 10 సినిమాలు చేశాను. తెలుగులో రాహుల్తో కలిసి ఈ సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అని చెప్పారు.