Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబా పటేల్ హీరో, హీరోయిన్లుగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఒరేయ్ బుజ్జిగా..'.
శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కొండా విజయ్కుమార్ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన చిత్రమిది. నూతన సంవత్సర కానుకగా జనవరి 1న ఈ చిత్రం థియేటర్స్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ, '2021కి స్వాగతం పలుకుతూ నూతన సంవత్సర కానుకగా మా బ్యానర్లో నిర్మితమైన ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హేబా పటేల్ హీరో, హీరోయిన్లుగా కొండా విజరుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్టైనర్ ఇది. లేటెస్ట్ ట్రెండ్కి అనుగుణంగా ఉన్న ఈ సినిమా కచ్చితంగా అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉంది. నాయకానాయికలు చాలా బాగా నటించారు. దర్శకుడు విజయ్ కుమార్ కొండా ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు' అని తెలిపారు.
యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబా పటేల్, వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కష్ణమురళి, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజరు ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధు నందన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, డాన్స్: శేఖర్, ఆర్ట్: టి.రాజ్కుమార్, ఫైట్స్: రియల్ సతీష్, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్, నిర్మాత: కె.కె.రాధామోహన్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: కొండా విజయ్కుమార్.