Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా, తమన్నా వ్యాస్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'వేయి శుభములు కలుగు నీకు'. జామి లక్ష్మీ ప్రసన్న సమర్పణలో జయ దుర్గ దేవి మల్టీ మీడియా పతాకం పై తూము నరసింహ పటేల్, జామి శ్రీనివాసరావు నిర్మిస్తున్న చిత్రమిది. రామ్స్ రాథోడ్ దర్శకుడు. ఈ చిత్రం ఇటీవలే గోవాలో చివరి షెడ్యూల్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సమ్మర్లో ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత తూము నరసింహ పటేల్ మాట్లాడుతూ, 'మా చిత్రానికి అద్భుతమైన టెక్నిషీయన్స్ పని చేసారు. సినిమా చాలా బాగా వస్తోంది. ఇటీవలే గోవాలో పాటలను చిత్రీకరించాం' అని తెలిపారు. మరో నిర్మాత జామి శ్రీనివాస రావు మాట్లాడుతూ, 'ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి' అని తెలిపారు. 'నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన మా నిర్మాతలు తూము నరసింహ పటేల్, జామి శ్రీనివాస రావు గారికి ధన్యవాదాలు. ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు గ్యాని సింగ్ మంచి పాటలు అందించారు. చిత్రీకరణ కూడా చాలా బాగా వచ్చింది. అందమైన లొకేషన్స్లో, అద్భుతమైన నటీనటులతో మా సినిమాని చిత్రీకరించాం. అందరినీ అలరించే సినిమా ఇది' అని దర్శకుడు రామ్స్ రాథోడ్ చెప్పారు.