Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సత్యదేవ్, గోపి గణేష్ పట్టాభి కాంబినేషన్లో రూపొందుతున్న మరో చిత్రం 'గాడ్సే'. సి.కె. స్క్రీన్స్ పతాకంపై సి. కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాపులర్ మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి కొన్ని తమిళ చిత్రాల్లో కూడా నటించింది. ఈ సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఇప్పటివరకూ చేయని భిన్న తరహా క్యారెక్టర్లో సత్యదేవ్ నటిస్తుండగా, ఐశ్వర్య లక్ష్మి కూడా నటనకు మంచి స్కోప్ ఉండే పాత్రలో నటిస్తోంది. 'బ్లఫ్ మాస్టర్' వంటి క్లాసిక్ మూవీ తర్వాత సత్యదేవ్, గోపిగణేష్ పట్టాభి యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ 'గాడ్సే'తో మళ్ళీ అలరించేందుకు రెడీ అవుతున్నారు. దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్ను గోపిగణేష్ పట్టాభి అందిస్తున్న ఈ చిత్రానికి సి.వి.రావు సహ నిర్మాత.