Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్.నారాయణమూర్తి హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా 'రైతు బంద్'. చిత్రీకరణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఈ సినిమా ఉంది. ఫిబ్రవరిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా సోమవారం మీడియాతో ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ, 'ఏవైతే రైతులకు మేలు జరుగుతాయని కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందో, అవి రైతులకు శాపాలు. మాకు ఉరితాడు అని పంజాబ్, ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాల నుంచి ఢిల్లీలో పెద్ద ఉద్యమం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ మూడు చట్టాలను తీసుకురావడం వల్ల దేశంలో ఉన్న వ్యవసాయం అంతా కార్పొరేట్ మయం అయిపోతుంది. వాణిజ్య పరంగా మీరు ఎవరికైతే వెసులుబాటు కల్పిస్తున్నారో వాళ్ళు మొత్తం సరుకుని రైతు దగ్గర కొని, కత్రిమ కొరత సష్టించి రైతులను, ప్రజలను చాలా డ్యామేజ్ చేస్తారు. దయచేసి ఆ చట్టాలను వెంటనే రద్దు చెయ్యండి. మీరు ఒకే భారత్, ఒకే మార్కెట్ అంటున్నారు. రైతు పండించే పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఏ రేటుకైనా అమ్ముకోవచ్చు అంటున్నారు. దేశంలో ఉన్న 75% వ్యవసాయ రంగం ఈరోజు 60% చేరుకుంది.ఈ 60%లో కూడా కౌలు రైతులు 40 శాతానికి వచ్చారు. మార్కెట్ యార్డులు మన దేశంలో పల్లెల్లో, జిల్లాల్లో ఒక కార్మిక బడుల్లాగా, ఆస్పత్రుల్లాగా రైతుల కోసం పని చేస్తున్నాయి. అలాంటిది ఈ చట్టాలతో మార్కెట్ యార్డులు కొలాప్స్ అయిపోతాయి. దానివల్ల కొనుగోలు కేంద్రాలు లేకపోతే రైతు ఏమైపోతాడు?, రైతు రక్షణ కోసం స్వామినాథన్ కమిటీ సిఫార్సులు చాలా మంచివి. రైతుకు మేలు జరిగే స్వామినాథన్ కమిటీని కాకుండా శాంతా రామ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ శాంతా రామ్ కమిటీ సిఫార్స్ మేరకే ఇప్పుడు చేసిన వ్యవసాయ చట్టాలు. ఇప్పుడు జరుగుతున్న రైతు ఉద్యమం ఈ మధ్యకాలంలో నేను చూడలేదు. అంత గొప్ప ఉద్యమం చేస్తున్నారు. ఈ తరహా వాస్తవ సంఘటనలతో, అనుభవాలతో రూపొందించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నాం' అని తెలిపారు.