Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు లోగిళ్లలో కళాకాంతులు, సంతోషాలు నింపే పండుగ సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇలా నాలుగు రోజులపాటు జరుపుకోవడం మనందరి ఆనవాయితి. 'హరిలో రంగ హరి..' అనే భక్త హరిదాసులు కీర్తనలు. రంగురంగుల రంగవల్లులు. రుచికరమైన పిండి వంటలు.. ఎగిరే పతంగులు..కోడి పందేలు.. పండుగ వేళ ఎక్కడ చూసినా ఇవే మనకు కనిపిస్తాయి. పంటలు చేతికొచ్చి.. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రాకతో ప్రతి ఇంటి లోగిళ్లన్నీ కళకళలాడుతుంటాయి. అలాంటి అందరికి ఇష్టమైన సంక్రాంతి విశిష్టతను తెలియచేసెలా ఓ ప్రత్యేక గీతాన్ని 'మన సంక్రాంతి 2021' పేరిట గ్రీన్ మెట్రో ఇన్ ప్రా టెక్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రై లిమిటెడ్ చైర్మన్ బొడ్డు అశోక్ నిర్మించారు. తాజాగా 'క్రేజీ అంకుల్స్' సినిమా సెట్లో సింగర్ మనో, యాంకర్, నటి శ్రీముఖి, రాజా రవీంద్ర సంయుక్తంగా ఈ పాటను ఆవిష్కరించారు. శ్రేయాస్ మీడియా యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ పాట విడదలై నెటిజెన్స్ను అలరిస్తోంది. నటీనటులు సుహాసిని, భానుచందర్పై కలర్ఫుల్గా రూపొందించిన ఈ పాటకు లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ అర్థవంతమైన సాహిత్యాన్ని అందించగా, భోలో షావలి, అంజనా సౌమ్య ఈ గీతాన్ని ఆలపించారు. సంక్రాంతి సందండినంతా నింపుకున్న ఈ పాట పండుగ వాతావరణాన్ని ముందుగానే తీసుకొచ్చింది.
సుహాసిని మణిరత్నం, భానుచందర్, అక్షిత, శ్రీతిక్ బాబు, పరమేష్ నటించిన ఈ పాటకు సాహిత్యం: కాసర్ల శ్యామ్, సింగర్స్ : భోలే షావలి, అంజనా సౌమ్య, ప్రోగ్రామింగ్, మిక్సింగ్: మదన్ ఎస్.కె, డిఓపి : ఎడిటింగ్-డిఐ : జనతా బాబు, కొరియోగ్రఫీ : దుర్గేష్, టోని కిక్, రఘుజాన్ డ్రోన్ : సురేష్ డెగవత్, సంగీతం - కాన్సెప్ట్ - దర్శకత్వం : భోలే షావలి, నిర్మాత : బొడ్డు అశోక్.