Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్తీక్ సాయి, డాలీషా, నేహా దేశ్ పాండే హీరో, హీరోయిన్లుగా చిన్నా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సైకో'. శ్రీమతి లావణ్య సమర్పణలో యాదవ్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై ఆవుల రాజు, సంకినేని వాసుదేవ రావు నిర్మిస్తున్న చిత్రమిది. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ మంగళవారం ప్రసాద్ ల్యాబ్లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అథితిగా విచ్చేసిన నిర్మాత బెల్లంకొండ సురేష్ టీజర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అవుల రాజు మాట్లాడుతూ,'ఈ సినిమా విషయంలో ఏంతో కష్టపడి, తపన పడి మా అబ్బాయి కార్తీక్ నటించాడు. అతని కష్టం చూసి నాకు అప్పుడప్పుడు బాధేసింది. కానీ ఈ సినిమా ట్రైలర్ చూశాక ఆ కష్టాన్ని మరచిపోయేలా చేసింది. తప్పకుండా మీరంతా మా సినిమాను, మా అబ్బాయిని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం ఎంతగానో సపోర్ట్ చేసిన వాసుదేవరావుకు థ్యాంక్స్' అని చెప్పారు. మరో నిర్మాత వాసుదేవ్ రావు మాట్లాడుతూ,'మా చిన్నా చెప్పిన కథ విని చాలా ఎగ్జైట్ అయ్యాను. దాన్ని అంతకంటే బాగా తెరపైకి తెచ్చాడు. ఈ సినిమాతో మా కార్తీక్ సూపర్ హిట్ కొట్టడం మాత్రం పక్కా. తప్పకుండా ఈ సినిమాను చూసి పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తున్నాను' అని తెలిపారు. 'ఈ సినిమా విషయంలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ముఖ్యంగా మా అమ్మ, నాన్నలకు, అలాగే వాసుదేవ్ గారికి. అయన నాకెంతో సపోర్ట్ చేసారు. ఇక ఈ సినిమా కోసం అందరిని కష్టపెట్టాను. వాళ్లకు నేను సారీ చెబుతున్నాను. ఈ సినిమాతో పక్కా సూపర్ హిట్ కొడుతున్నాం. త్వరలోనే ఈ సినిమా విడుదల చేస్తాం' అని హీరో, దర్శకుడు కార్తీక్ అన్నారు.
'ఈ సినిమాలో మంచి పాత్రలు పోషించే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమాతో మాకెంతో గుర్తింపు వస్తుంది' అని కథానాయికలు డాలీషా, నేహాదేశ్పాండే తెలిపారు.