Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తనయుడు శ్రీసింహా కోడూరి 'మత్తు వదలరా' చిత్రంతో హీరోగా పరిచయమై అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆయన నటిస్తున్న రెండో చిత్రం 'తెల్లవారితే గురువారం'. సంక్రాంతి పర్వదినం సందర్భంగా గురువారం ఫస్ట్లుక్ పోస్టర్ను చిత్ర బృందం విడుదల చేసింది. టైటిల్ ఎంత విలక్షణంగా ఉందో, పోస్టర్ను అంత ఆసక్తికరంగా డిజైన్ చేశారు. ఈ పోస్టర్లో పెళ్లికొడుకు గెటప్లో మహారాజా కుర్చీలో కూర్చొని తీవ్రంగా ఆలోచిస్తూ కనిపిస్తున్నారు శ్రీసింహా. ఆయన చేతిలో పెళ్లి దండ కూడా ఉంది. శ్రీసింహా సరసన నాయికలుగా చిత్రా శుక్లా, మిషా నారంగ్ నటిస్తున్నారు. ఈ చిత్రంతో మణికాంత్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సాయి కొర్రపాటి సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తండ్రి కీరవాణి తరహాలోనే బాణీలు కడుతూ ప్రామిసింగ్ మ్యూజిక్ డైరెక్టర్గా రాణిస్తున్న కాలభైరవ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. మార్చి నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.