Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభాస్, 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం 'సలార్'. హౌంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరంగందూర్ ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం లాంఛనంగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా ఈ సినిమా ప్రారంభమైంది. ఈ వేడుకకు కర్ణాటక డిప్యూటీ సీఎం అశ్వత్ నారాయణ్, కన్నడ స్టార్ యష్, నిర్మాతలు దిల్రాజు, డి.వి.వి.దానయ్య, నవీన్ ఎర్నేని, సాయికొర్రపాటి తదితరులు హాజరై చిత్ర యూనిట్ను అభినందించారు. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ, 'నాకు అవకాశం ఇచ్చిన హౌంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరగందూర్ కి, హీరో ప్రభాస్కి ధన్యవాదాలు. అలాగే నా ప్రియమైన రాకింగ్ స్టార్ యష్ ఈ రోజు మాతో ఉండటం మరింత ఆనందాన్ని ఇచ్చింది. మీ ప్రేమ, ఆశీర్వాదాలు అందిస్తున్న అందరికీ థాంక్స్. 'సలార్' మిమ్మల్ని నిరాశపరచదు' అని అన్నారు. 'సలార్' చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ హౌంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరగందూర్ ధన్యవాదాలు తెలిపారు.