Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంజీఆర్ సహకారంతో జయలలిత నటిగా, రాజకీయ నాయకురాలిగా ఎలా ఎదిగారనే ఇతివత్తంతో దర్శకుడు ఎ.ఎల్. విజరు 'తలైవి' చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
'పీపుల్స్ కింగ్'గా కీర్తి ప్రతిష్ఠలు ఆర్జించిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ ఎం.జి.రామచంద్రన్ జయంతి సందర్భంగా 'తలైవి' చిత్ర బందం ఆదివారం ఎంజీఆర్, జయలలిత పాత్రధారులు అరవింద్ స్వామి, కంగనా రనౌత్ జంటగా ఉన్న సరికొత్త స్టిల్ను విడుదల చేసింది. దాంతో పాటు 'తలైవి'గా జయలలిత ఎదగడంలో ఎంజీఆర్ పోషించిన పాత్రను గుర్తు చేస్తూ ఓ చిన్న వీడియో గ్లింప్స్ను కూడా రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ శైలేష్ ఆర్.సింగ్ మాట్లాడుతూ, 'ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు రిలీజ్ చేసిన జయలలిత పాత్రధారి కంగనా రనౌత్ లుక్కి, ఎంజీఆర్గా అరవింద్ స్వామి లుక్కి వచ్చిన అపూర్వమైన స్పందన మాలో అమితమైన ఉత్సాహాన్ని నింపింది. అంచనాలను మరింత పెంచేలా ఎంజీఆర్ జయంతి సందర్భంగా తలైవి పాత్రధారి కంగనా రనౌత్తో ఆయన రొమాంటిక్ స్టిల్ను లేటెస్ట్గా రిలీజ్ చేశాం. మా సినిమాపై ప్రేక్షకుల ప్రేమాభిమానాలు కొనసాగుతాయని, సౌత్ ఇండియన్ సినిమా, పాలిటిక్స్లో తమదైన ముద్ర వేసిన లెజెండ్స్కు మేం అర్పిస్తున్న నివాళిని స్వీకరిస్తారని ఆశిస్తున్నాం'' అని చెప్పారు. విబ్రి మోషన్ పిక్చర్స్, కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై విష్ణువర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్. సింగ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.