Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'దేవదాసు' సినిమాతో 15 ఏళ్ల క్రితం సంక్రాంతి సీజన్లో థియేటర్లలోకి వచ్చాను. మళ్లీ ఇప్పుడు 'రెడ్' రిలీజ్తో మీ ముందుకి వచ్చాను.
నాకు సిసలైన పోటీ ఎవరన్నది 15 ఏళ్ల తర్వాత అర్థమైంది. నేను ప్రేక్షకుల మీద చూపించే అభిమానం, అభిమానులు నా మీద చూపించే అభిమానం ఎప్పుడూ పోటీపడుతూనే ఉంటాయి. ఇంతకు మించిన పోటీ ఇంకేం ఉంటుంది?' అని హీరో రామ్ పోతినేని అన్నారు. 'రెడ్ ' సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ విశాఖపట్టణంలోని గురజాడ కళాక్షేత్రంలో శనివారం రాత్రి జరిగాయి. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొని, సినిమా విజయం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. రామ్ ద్విపాత్రాభినయం చేసిన సినిమా 'రెడ్'. సంక్రాంతి సందర్భంగా విడుదలై మంచి కలెక్షన్లను రాబడుతోంది. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిశోర్ నిర్మించిన చిత్రమిది. కష్ణ పోతినేని సమర్పణలో కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు.
హీరో రామ్ మాట్లాడుతూ,'మార్నింగ్ షోకి వచ్చిన అభిప్రాయాలన్నీ సాయంత్రానికి మారిపోయాయి. ప్రతి షో పూర్తయిన తర్వాత మరుసటి షోకి కలెక్షన్లు అంతకంతకూ పెరిగాయి. మా సస్పెన్స్ థ్రిల్లర్ని థ్రిల్లింగ్ హిట్ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు' అని తెలిపారు. 'మా సినిమాని ఇంతగా ఆదరిస్తున్న అభిమానులకి హదయపూర్వక ధన్యవాదాలు. వైజాగ్కీ నాకూ ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంది. సినిమాకి సహాయపడిన చాలా మంచి మాటలన్నీ ఇక్కడ పుట్టినవే. 'రెడ్' ఈ రోజు ఇంత సక్సెస్ అయ్యిందంటే అతి ముఖ్యకారణం రామ్ గారే. ఆయన చేసిన మాస్ క్యారెక్టర్ని థియేటర్లో జనాలు ఎంజాయ్ చేస్తున్న తీరు మాటల్లో చెప్పలేను. మా చిత్రాన్ని మీ ఫ్యామిలీతో కలిసొచ్చి చూడండి. అందరికీ తప్పకుండా నచ్చుతుంది' అని దర్శకుడు కిశోర్ తిరుమల చెప్పారు.