Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లరి నరేష్, పూజా జవేరి జంటగా గిరి పాలిక దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బంగారు బుల్లోడు'. ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 23న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ ప్రసాద్ల్యాబ్లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా హీరో నరేష్ మాట్లాడుతూ, 'పాండమిక్ తర్వాత సంక్రాంతికి సినిమాలు రిలీజై బాగా అడుతున్నాయి. దీంతో మా అందరికీ చాలా నమ్మకం కలిగింది. అందుకే మా చిత్రాన్ని ఈనెల 23న రిలీజ్ చేస్తున్నాం. కథలో కామెడీ రన్ అవుతూ ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్గా దర్శకుడు గిరి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. వెలిగొండ శ్రీను బ్యూటిఫుల్ డైలాగ్స్ రాశాడు. ఒక మంచి సినిమా చేశాం. సినిమా చూశాక చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. సాయి కార్తీక్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. రీమేక్ చేసిన స్వాతిలో ముత్యమంత సాంగ్కి ఎక్స్ట్రార్డినరి రెస్పాన్స్ వచ్చింది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. తప్పకుండా ఈ చిత్రం అందరూ ఎంజారు చేసే విధంగా ఉంటుంది. బాలకష్ణగారి 'బంగారు బుల్లోడు'కి మా చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు. ఒక బంగారు షాప్లో వర్క్ చేస్తూ గ్రామీణ బ్యాంక్లో పనిచేసే వాడి కథ. బంగారం తాకట్టు పెట్టుకుని రుణాలు ఇస్తుంటాడు. అందుకే ఈ సినిమాకి 'బంగారు బుల్లోడు' టైటిల్ పెట్టడం జరిగింది. అడగ్గానే ఈ టైటిల్ ఇచ్చిన బాలకష్ణ గారికి, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్కి కృతజ్ఞతలు' అని తెలిపారు.
''నందిని నర్సింగ్ హోమ్' సినిమా తర్వాత చేస్తున్న చిత్రమిది. 'బెండు అప్పారావు' తర్వాత విలేజ్ బ్యాక్డ్రాప్లో నరేష్ నటిస్తున్న చిత్రమిది. ఆద్యంతం వినోదభరితంగా సాగే ఈ సినిమా అందరినీ మెప్పిస్తుందనే నమ్మకం ఉంది' అని దర్శకుడు గిరి పాలిక చెప్పారు. కథానాయిక పూజా జవేరి, హాస్యనటీనటులు రజిత, ప్రభాస్శ్రీను, భద్రం, రచయిత వెలిగొండ శ్రీనివాస్, సంగీత దర్శకుడు సాయి కార్తీక్, లైన్ ప్రొడ్యూసర్ మహేష్, కెమెరామెన్ సతీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.