Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభాస్, సైఫ్ అలీఖాన్ ముఖ్యపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'ఆదిపురుష్'. భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర మోషన్ క్యాప్చర్ చిత్రీకరణ మంగళవారం ప్రారంభమైంది. ఈ చిత్రం ఎనౌన్స్ చేసిన దగ్గర్నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబల్స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్, తెలుగు ప్రేక్షకులు భారీ అంచనాలతో ఈ చిత్ర అప్డేట్స్ని ఫాలో అవ్వటం, ఈ ప్రాజెక్ట్పై ఉన్న క్రేజ్ని తెలియజేస్తుంది. ఈ సందర్భంగా భూషణ్ కుమార్ మాట్లాడుతూ,'టీ సిరీస్లో కొత్త ఐడియాలు, కొత్త కాన్సెప్ట్లను మేం ఎప్పుఉడూ ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాం. అలాగే ఫిలిం మేకింగ్లో సరికొత్త టెక్నాలజీని వాడుకుంటూనే ఉన్నాం. ఓంరౌత్, ఆయన టీమ్ కలిసి 'ఆదిపురుష్' లాంటి ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సష్టిస్తున్నారు. దానికోసం ఇంటర్నేషనల్ సినిమాల్లో వాడే లేటెస్ట్ టెక్నాలజీ వాడుకుంటున్నారు. తొలిసారి ఇండియాలో అత్యంత భారీ టెక్నాలజీని ఉపయోగించుకోబోతున్నాం. 'బాహుబలి' స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ అద్భుతాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం' అని తెలిపారు. నిర్మాత ప్రసాద్ సుతార్ మాట్లాడుతూ,'సాధారణంగా ఇంటర్నేషనల్ సినిమాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన విజువల్ ఎఫెక్ట్స్ వాడుతుంటారు. ఫిలిం మేకర్స్కు వాళ్ళ కథ చెప్పడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. 'ఆదిపురుష్' లాంటి ఒక అద్భుతమైన ప్రపంచం సష్టించడానికి మేం కూడా ఇదే చేయబోతున్నాం. ఈ సినిమా మా అందరికీ ఒక ఒక మైలురాయి లాంటిది. భూషణ్తో కలిసి పని చేయడానికి ఆసక్తిగా వేచి చూస్తున్నాం' అని తెలిపారు. ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రాన్ని ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను టి సిరీస్ బానర్ పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్ నిర్మిస్తున్నారు. ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ సహ నిర్మాతలు. ఫిబ్రవరి 2 నుంచి ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ఆరంభం కానుంది.