Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-టి పి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రమణ
నవతెలంగాణ కంటేశ్వర్
పిఆర్సీ సత్వర అమలు, ఇతర సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈనెల 23న ఐక్యవేదిక రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు హైదరాబాద్ ధర్నా చౌక్ నందు ఒకరోజు నిరాహారదీక్ష చేపట్టాలని, అదేరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, మండల కేంద్రాలు, విద్యాసంస్థల్లో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని, ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సభ్యులు, టి పి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె. రమణ తెలిపారు.అన్ని సంఘాల జిల్లా శాఖల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో భోజన విరామ ప్రదర్శనలు నిర్వహిస్తారని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులతో నిరసన ప్రదర్శనల్లో పాల్గొనాలని,ఈ నిరసన ప్రదర్శనలు విజయవంతం చేయాలని కోరారు.
ఉద్యోగులు, పెన్షనర్లు జిల్లా కలెక్టరేట్లు, మండల రెవిన్యూ కార్యాలయాల వద్ద, ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల్లో నిరసన ప్రదర్శనల్లో పాల్గొనాలి. ఈ నెలాఖరులోగా సమస్యలు పరిష్కారం కాకుంటే ఫిబ్రవరిలో రాష్ట్ర స్థాయిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లను కదిలించి ప్రత్యక్ష కార్యాచరణను చేపడతామని రమణ తెలిపారు.ఐక్యవేదిక బాధ్యులను వెంటనే సి.ఎం చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. పిఆర్సీ నివేదికను వెంటనే పబ్లిక్ డొమైన్ లో పెట్టి ప్రజలకు అందుబాటులో ఉంచాలి.ఈ నెలాఖరులోగా సంఘాలతో చర్చించి ఆమోదయోగ్యమైన ఫిట్మెంట్ తో 1.07.2018 నుండి నూతన వేతనాలు అమలు చేయాలి.16 మే 2018 న ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలుకు ఉత్తర్వులు ఇవ్వాలి.కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి.సిపిఎస్ రద్దుచేసి పాత పెన్షన్ పునరుద్దరించాలి. 1.09.2004 కు ముందు ఎంపిక ప్రక్రియ పూర్తై తర్వాత నియామకమైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలి.