Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అదిరే అభి, హీనారాయ్, రేచల్ హీరో, హీరోయిన్లుగా రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ 'పాయింట్ బ్లాంక్'. వీవీఎస్జీ దర్శకత్వంలో ఐశ్వర్యం మీడియా క్రియేషన్స్ పతాకంపై డా.కొన్నిపాటి శ్రీనాథ్ నిర్మించారు. అమెజాన్ ప్రైమ్ యూఎస్లో ఈనెల 9న విడుదలై ఈ సినిమా సూపర్ వ్యూస్ని సాధించి, సక్సెస్ ఫుల్గా రన్ అవుతోంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ బుధవారం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా నిర్మాత శ్రీనాథ్ మాట్లాడుతూ .. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను. ఈ కథ బాగా నచ్చడంతో నిర్మించిన ఈ సినిమా సక్సెస్ కావడం చాలా ఆనందంగా ఉంది. నాగబాబు గారు ఈ సినిమా సక్సెస్ మీట్లో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు' అని అన్నారు. హీరో అదిరే అభి మాట్లాడుతూ, 'ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. నాకు ఇండిస్టీలో పెద్దదిక్కు నాగబాబు, అలాగే ఇక్కడికి వచ్చిన వి.ఎన్. ఆదిత్యకి, లక్ష్మి భూపాల్కి, భరద్వాజ గారికి థ్యాంక్స్' అని చెప్పారు. 'అభి మంచి ఆర్టిస్ట్, మంచి యాంకర్. తాను హీరోగా ప్రూవ్ చేసుకోవాలన్న తాపత్రయానికి హ్యాట్సాఫ్. ఈ సినిమా అమెజాన్ అమెరికాలో విడుదలై, సక్సెస్ అందుకోవడం ఆనందంగా ఉంది. అభి నటించిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు కూడా చూడాలి. అభి తప్పకుండా సినిమాలా, ఓటీటీ అనేది కాకుండా తప్పకుండా సక్సెస్ అవుతాడు. అభిలో నటుడే కాదు, మంచి డైరెక్టర్ కూడా ఉన్నాడు. భవిష్యత్తులో అభి నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా ఎదగాలని కోరుకుంటున్నాను. కేవలం జబర్దస్త్ కమెడియన్గానే కాకుండా నటుడిగానూ మరింత స్థాయికి వెళ్ళాలని ఆశిస్తున్నాను' అని నాగబాబు చెప్పారు.