Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శింబు, శ్రియ, తమన్నా నాయకానాయికలుగా నటించిన తమిళ చిత్రం 'ఎఎఎ'. కుసుమ ఆర్ట్స్ పతాకంపై యాళ్ళ కీర్తి నిర్మాణ సారథ్యంలో, జక్కుల నాగేశ్వరరావు సమర్పణలో ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని నిర్మాత యాళ్ళ వెంకటేశ్వరరావు (కపావరం) తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా చిత్ర బృందం బుధవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నిర్మాత యాళ్ళ వెంకటేశ్వరరావు (కపావరం) మాట్లాడుతూ, 'టాప్ స్టార్స్ శింబు, తమన్నా, శ్రియ హీరో, హీరోయిన్లుగా రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. యాక్షన్తో పాటు ఫుల్ గ్లామర్ కలబోసిన చిత్రం కూడా. ఈ నెల 22న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రానికి కావాల్సిన అన్ని హంగులను సమకూర్చాం. డైలాగ్స్, పాటలు అన్నీ ప్రేక్షకులను మెప్పిస్తాయి. మా బ్యానర్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉంది' అని అన్నారు. జక్కుల నాగేశ్వరరావు, బాలాజీ నాగలింగం, బొప్పన గోపీ తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.