Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మజ్ను ఫిలింస్ పతాకంపై బల్వాన్ (మాజీ మిస్టర్ ఆంధ్ర), శ్రావణి జంటగా రూపొందుతున్న చిత్రం 'ఎవరా కిల్లర్?'. షేక్ సంధాని బాషా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. రిపబ్లిక్డే సందర్బంగా ఈ నెల26న డిజిటల్ ప్లాటుఫామ్స్ హంగామా, అమెజాన్ ఎంఎక్స్ప్లేయర్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్, వోడాఫోన్లలో విడుదలవుతోంది.
ఈ సందర్భంగా దర్శక, నిర్మాత షేక్ సంధాని బాషా మాట్లాడుతూ,'జంట నగరాల్లో జరిగిన జంట హత్యల నేపథ్యంలో లేడీ ఇన్స్పెక్టర్గా హీరోయిన్, ఆమెకు సహకరించే ప్రవేట్ డిటెక్టీవ్ పాత్రలో హీరో.. వీరిద్దరూ కలిసి మర్డర్ మిస్టరీని ఎలా చేధించారు. ఇంతకీ ఎవరాకిల్లర్?, ఆ కిల్లర్ని పట్టుకునే క్రమంలో ఎలాంటి పరిణామాలు సంభవించాయనే సస్పెన్స్తో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కించాం. దీనికి స్వీక్వెల్గా పార్ట్2 కూడా చేస్తున్నాం. ఆర్టిస్టులు, టెక్నిషన్ల వివరాలు త్వరలోనే తెలియజేస్తాం' అని తెలిపారు. కథానాయకుడు బల్వాన్ మాట్లాడుతూ,'మాజీ మిస్టర్ ఆంధ్ర టైటిల్ సాధించిన నేను 47 చిత్రాల్లో సోలో ఫైటర్గా నటించాను. ఈ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నాను' అని చెప్పారు. 'ఎన్నో టీవీ సీరియల్స్లో నటిస్తున్న నన్ను ఈ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయం చేసిన దర్శక, నిర్మాతలకు కతజ్ఞతలు' అని కథానాయిక శ్రావణి చెప్పారు.