Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శైలేష్ సన్ని, జ్ఞానేశ్వరి కండ్రేగుల జంటగా రూపొందుతున్న చిత్రం 'మిస్టర్ అండ్ మిస్. రీడింగ్ ల్యాంప్స్ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 29న విడుదలవుతున్న సందర్భంగా చిత్ర ట్రైలర్ను మధుర శ్రీధర్ రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,'నాకు ఇష్టమైన దర్శకుల్లో అశోక్ ఒకరు. 'ఓ స్త్రీ రేపు రా' సినిమాని తీశాడు. తనెప్పుడూ కొత్త కాన్సెప్ట్స్తో సినిమాలు చేస్తుంటాడు. కొత్త కాన్సెప్ట్తో వచ్చిన 'ఆర్ఎక్స్100' సినిమాలా ఈ మూవీ ఉంటుందనిపిస్తోంది. యశ్వంత్ నాగ్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. నటీనటులందరూ చక్కగా నటించారు. ఈ సినిమాకి అన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. దీంతో సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయనే నమ్మకం ఉంది. ఈ నెల 29న థియేటర్లో విడుదల చేస్తున్న ఈ సినిమా కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను. టీమ్ అందరికీ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.