Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీకాంత్, సునీల్ ప్రధాన పాత్రల్లో శ్రీ కార్తికేయ, అభిరామ్, ప్రవీణ్, హరీష్ గౌతమ్లను హీరోలుగా పరిచయం చేస్తూ రూపొందుతున్న చిత్రం 'జై సేన'.
వి.విజయలక్ష్మి, సుష్మారెడ్డి ఫిలిమ్స్ సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో వి.సాయి అరుణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 29న గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ఫిలింఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సునీల్ మాట్లాడుతూ, 'మా తాత గారు ఒక రైతు. నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్లకపోతే నన్ను పొలం దగ్గరకు తీసుకెళ్లేవారు. ఒక రైతుకు మన అవసరం లేకున్నా.. మనందరికీ రైతు అవసరం తప్పకుండా ఉంటుంది. అందుకని వారి సమస్యలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ ఐపీయస్ ఆఫీసర్గా నటించాను. ఇలాంటి మంచి సినిమాల్లో నటించే అవకాశం చాలా రేర్గా వస్తుంది. రైతుల సమస్యలను పది మందికి చెబుతూ, ఒక మంచి పరిష్కారాన్ని చూపించడం చాలా గొప్ప విషయం. ఒక మంచి ఆశయంతో తీసిన సినిమాకి మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.
''జైసేన' అనగానే అందరికీ జనసేన అన్నట్టుగా వినపడుతుంది. అది నిజమే ఎందుకంటే జనసేన అనేది పవన్కళ్యాణ్ గారి పార్టీ. మేమందరం దాన్ని అభిమానిస్తాం అలాగే 'జైసేన' సినిమా పవన్కళ్యాణ్ భావాలకు దగ్గరిగా ఉండే సినిమా. అలాగే రైతుల సమస్యల గురించి సినిమాలో చర్చించాం. రైతులకు న్యాయం జరిగే విధంగా ఒక మంచి పరిష్కారాన్ని కూడా చూపించాం. అందుకే ఈ సినిమాని రైతులకు అంకితం చేస్తున్నాం. రైతులకు సపోర్ట్ అందించడం మనందరి భాధ్యత అని చెప్పే సినిమా. రైతుల కోసం తీసిన కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ సినిమాకి ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని కోరుకుంటున్నాను' అని దర్శకుడు సముద్ర చెప్పారు.
కో ప్రొడ్యూసర్స్ శిరీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, 'రైతుల మీద మంచి సబ్జెక్ట్తో తీసిన ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం' అని తెలిపారు.