Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'లక్ష్య'. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కేతిక శర్మ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో జగపతిబాబు నటిస్తున్నారు. నాగశౌర్య 20వ చిత్రంగా ప్రాచీన విలువిద్య నేపథ్యంలో స్పోర్ట్స్ బేస్డ్ చిత్రంగా అన్ని కమర్షియల్ హంగులతో ఈ సినిమా తెరకెక్కుతోంది. శుక్రవారం నాగశౌర్య బర్త్డే సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర బృందం రిలీజ్ చేసిన టీజర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది.
'చాలా మందికి ఆటతో గుర్తింపు వస్తుంది. కానీ ఎవడో ఒకడు పుడతాడు, ఆటకే గుర్తింపు తెచ్చేవాడు' అంటూ జగపతిబాబు వాయిస్ ఓవర్తో ప్రారంభమైన ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ సినిమాలో ఆర్చరీలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన వ్యక్తిగా నాగశౌర్య కనిపించనున్నాడని తెలుస్తోంది. రెండు విభిన్నమైన గెటపుల్లో కనిపించడంతో నాగశౌర్య పాత్రలో రకరకాల షేడ్స్ ఉన్నాయనే విషయం అర్థం అవుతోంది. చివరలో 'పడిలేచిన వాడితో పందెం చాలా ప్రమాదకరం..' అంటూ జగపతి బాబు చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. కాలబైరవ బ్యాగ్రౌండ్స్కోర్ ఈ టీజర్కు మరింత బలాన్నిచ్చింది. ఈ టీజర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోంది.