Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాంకర్ ప్రదీప్ హీరోగా పరిచయం అవుతూ నటిస్తున్న చిత్రం '30 రోజుల్లో ప్రేమించడం ఎలా'. యస్.వి.ప్రొడక్షన్స్ పతాకంపై ఫణి ప్రదీప్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. అమృత అయ్యర్ హీరోయిన్గా యస్.వి.బాబు నిర్మించిన ఈ చిత్రం ఈనెల 29న వరల్డ్ వైడ్గా విడుదలవుతోంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత యస్.వి.బాబు మాట్లాడుతూ, 'ఇటీవల రిలీజైన ట్రైలర్కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మా సినిమాకి ఇంతలా క్రేజ్ రావడానికి కారణం అనూప్ ఇచ్చిన మ్యూజిక్. చంద్రబోస్ వండర్ఫుల్ లిరిక్స్ రాశారు. ఈ నెల 29న వరల్డ్ వైడ్గా యువి, జిఏ2 ద్వారా సినిమా రిలీజ్ అవుతుంది. అంత పెద్ద సంస్థలు మా సినిమాని విడుదల చేస్తున్నందుకు అదష్టంగా, గర్వంగా ఫీలవుతున్నాను. సినిమా చూసిన ప్రేక్షకులు హ్యాపీగా వెళ్తారని గ్యారెంటీగా చెబుతున్నాను' అని అన్నారు. దర్శకుడు ఫణి ప్రదీప్ మాట్లాడుతూ,'నువ్వే కావాలి, క్షణం, స్వామిరారా' చిత్రాల ఇన్స్పిరేషనే ఈ సినిమా చేయడానికి కారణం. సినిమా బాగా వచ్చింది. చూసిన మా టీమ్ అంతా కంట తడి పెట్టారు. అంత బాగా కనెక్ట్ అయ్యారు. 'నీలి నీలి ఆకాశం పాట..' ఎంత పెద్ద హిట్ అయ్యిందో సినిమా కూడా అంతే హిట్ అవుతుందని కాన్ఫిడెంట్గా ఉన్నాం' అని చెప్పారు. 'ఇప్పటివరకు డిఫరెంట్ టెలిషోస్ చేశాను. అదొక మంచి ఎక్స్పీరియెన్స్ ఇచ్చింది. యాంకర్గా ప్రజలందరూ ఆదరించారు. యాక్టర్ అవ్వాలనేది నా కల. అది తీరడానికి పదేళ్లు పట్టింది. మున్నా ఫస్ట్ ఈ కథ చెప్పగానే బాగా నచ్చింది. యస్వీ బాబు గారు గ్రేట్ హంబుల్ పర్సన్. సినిమాకి అన్నీ ప్రొవైడ్ చేసి, అన్ కాంప్రమైజ్గా ఈ చిత్రాన్ని నిర్మించారు. అనూప్ మ్యూజిక్, చంద్రబోస్ లిరిక్స్, శివేంద్ర విజువల్స్ సినిమాకి బిగ్ ఎస్సెట్స్ అవుతాయి. నా క్యారెక్టర్తోపాటు క్యారెక్టరైజేషన్ని దర్శకుడు మున్నా బాగా డిజైన్ చేశాడు. సినిమా చూసి చిరునవ్వుతో బయటికి వస్తారని ప్రామిస్ చేస్తున్నా. ఇదొక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అన్నీ ఎమోషనల్ సీన్స్కి ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. అమత అయ్యర్ అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేసింది' అని కథానాయకుడు ప్రదీప్ అన్నారు.