Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'7 టు 4', 'లవ్ బూమ్', 'అంతకుమించి' వంటి చిత్రాలతో ఇప్పటికే తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు రాజ్ బాల. ఆయన హీరోగా నటించిన 'చిత్రం ఎక్స్' నూతన సంవత్సరం కానుకగా ఈనెల 1వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి ఆదరణ పొందింది. అలాగే ఆయన విలన్గా నటించిన 'తొంగి తొంగి చూడమాకు చందమామ' చిత్రం ఈనెల 22న రిలీజై విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. ఆనంద్ కానుమోలు దర్శకత్వంలో ఎ.మోహన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. దిలీప్, శ్రావణి జంటగా నటించిన ఈ చిత్రంలో రాజ్బాల పోషించిన రాణా బాబు పాత్రకు మంచి స్పందన లభిస్తోంది. ఒకే నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చిన రెండు సినిమాలు మంచి ఆదరణ పొందడం ఓ విశేషమైతే, ఓ సినిమాలో నాయకుడిగా, మరో సినిమాలో ప్రతినాయకుడిగా రాజ్బాల నటించి ప్రేక్షకులను అలరించడం మరో విశేషం.
ఈ సందర్భంగా తన సక్సెస్ఫుల్ జర్నీ గురించి రాజ్బాల మాట్లాడుతూ, 'సినిమా, యాక్టింగ్ అంటే ప్యాషన్. అసిస్టెంట్ ప్రొఫెసర్గా సాఫీగా సాగిపోయే ఉద్యోగాన్ని వదులుకుని మరీ పరిశ్రమకి వచ్చాను. ఇక్కడ అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ చిత్తశుద్ధితో కషి చేస్తూ వస్తున్నాను. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాను. పదేళ్లుగా పడుతున్న కష్టానికి తగిన ఫలితం ఇప్పుడిప్పుడే లభించడం ఆనందంగా ఉంది. రెండు వారాల వ్యవధిలో, రెండు సినిమాలు విడుదల కావడం. ఒకదాంట్లో హీరోగా, ఇంకోదానిలో మెయిన్ విలన్గా నటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ రెండు సినిమాలు చూసినవారంతా నా నటన చాలా బాగుందంటున్నారు. నా జర్నీలో నాకు సహకరించిన, సహాయ పడిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను నటించిన 'మిస్టర్ క్యూ', '5 డబ్ల్యూస్' సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. అలాగే 'కష్ణలంక' చిత్రంతోపాటు ఇంకా పేరు పెట్టని మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నాను. పాత్ర నచ్చితే హీరోగానే కాదు ప్రతినాయకుడిగానూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాను' అని తెలిపారు.