Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్యాన్ గౌర, దివ్య పాండే జంటగా రూపొందిన చిత్రం 'జి- జాంబీ'. సాయి సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్యన్ గౌర-దీపు స్వీయ దర్శకత్వంలో సూర్య నిర్మించిన చిత్రమిది. తెలుగులో మొదటిసారిగా జాంబీ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని, క్లీన్ 'యు' సర్టిఫికెట్ పొందింది. ఫిబ్రవరి 5న ఈ చిత్రం అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సందర్బంగా ఈ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుక ఆదివారం ప్రసాద్ ల్యాబ్స్లో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా హీరో ఆర్యాన్ గౌర మాట్లాడుతూ,'జాంబీస్ జోనర్లో ఇంతవరకూ తెలుగులో సినిమా రాలేదు. నన్ను, నా కథని నమ్మి కొత్త వాళ్ళమైనా బడ్జెట్కి వెనకాడకుండా మా నిర్మాత సూర్య ఈ చిత్రాన్ని నిర్మించారు. మైక్రో ఇయర్ సౌండ్ డిజైన్ని ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నాం. ఇది ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియెన్స్ ఇస్తుంది. సినిమా చాలా బాగా వచ్చింది' అని చెప్పారు. దర్శకుడు హేమంత్ మధుకర్ మాట్లాడుతూ,' ఇప్పటికే హాలీవుడ్, బాలీవుడ్ల్లో జాంబీస్ జోనర్లో సినిమాలు వచ్చాయి. మన తెలుగులో రావడం ఇదే ఫస్ట్ టైమ్. ట్రైలర్ చాలా బాగుంది. జాంబీస్లో స్పెషల్ ఏంటంటే అందులో హర్రర్, భయం ఉంటూనే ఫన్ కూడా ఉంటుంది' అని చెప్పారు. 'ఆర్యాన్, సూర్య లేకపోతే ఈ సినిమా లేదు. సినిమా స్టార్టింగ్ నుండి ఇప్పటివరకూ తోడుగా ఉండి, ఎన్నో విషయాల్లో హెల్ప్ చేసిన ఆర్యాన్కి నా స్పెషల్ థ్యాంక్స్. మా కొత్త ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను' అని దర్శకురాలు దీపు అన్నారు.