Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నందు విజయ్ కృష్ణ, రష్మి జంటగా నటిస్తున్న చిత్రం 'బొమ్మ బ్లాక్బస్టర్'. ఈ చిత్రాన్ని విజయీభవ ఆర్ట్స్ పతాకం పై ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో రాజ్ విరాట్ దర్శకుడు పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర టీజర్ అటు ఆడియెన్స్లో, ఇటు ఇండిస్టీ వర్గాల్లో అనూహ్య స్పందన దక్కించుకుంది. ట్రేడ్లో కూడా మంచి బిజినెస్ క్రేజ్ని సొంతం చేసుకుంది. అలాగే ఈ చిత్రం ఆడియో ఆల్బమ్ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ సాంగ్ కూడా విశేష ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో 'నడికుడి రైలంటి సోదరా...' అంటూ సాగే పాటను తాజాగా యువ కథానాయకుడు సుధీర్బాబు విడుదల చేశారు. 'మెంటల్ మదిలో', 'బ్రోచేవారేవురురా' చిత్రాల ద్వారా మంచి సక్సస్ని సొంతం చేసుకుని, ప్రస్తుతం హీరో నానితో 'అంటే .. సుందరానికి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ పాటకు లిరిక్స్ అందించడం విశేషం. లహరి మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియో విడులవుతోంది.
ఈ సందర్బంగా హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ,'ఈ చిత్ర టీజర్ని చూసినప్పుడే చాలా ప్రామిసింగ్గా అనిపించింది. ఈ చిత్రంలో నందు కొత్తగా కనిపిస్తున్నాడు. ఆయన క్యారెక్టర్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. 'నడకుడి రైటంటి సోదరా...' పాటని నేను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ఈ పాటకి ఓ ప్రత్యేకత ఉంది. 'మెంటల్ మదిలో', 'బ్రోచేవారేవురు' చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ లిరిక్స్ అందించారు. వివేక్ ఆత్రేయ చిత్రాలు చూశాను. చాలా నేచురల్గా ఉంటూ మెప్పిస్తున్నారు. అలాగే ఈ పాటలో ఆయన రాసిన లిరిక్స్ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. మల్టిటాలెంటెడ్ దర్శకుడు వివేక్ ఆత్రేయ. ఆయనలాంటి పర్సన్స్ పరిశ్రమకు రావటం శుభ పరిణామం. అంతేకాకుండా ఈ పాటని ప్రముఖ సింగర్ వైకామ్ విజయలక్ష్మి పాడటం హైలెట్గా నిలిచింది. ఈ చిత్రం నందు, దర్శకుడు రాజ్ విరాఠ్ కెరీర్కి పెద్ద బ్రేక్ అవ్వాలని కొరుకుంటున్నాను. అలాగే నిర్మాతలకు మంచి లాభాలు రావాలి. వాళ్ళు మరిన్ని చిత్రాలు తీయాలని కోరుకుంటున్నాను' అని చెప్పారు.
నందు విజయ్ కృష్ణ, రష్మీ గౌతమ్, కిరిటి, రఘు కుంచె తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ : బి. సుభాష్కర్, సినిమాటోగ్రఫీ : సుజాతా సిద్ధార్థ్, మ్యూజిక్ : ప్రశాంత్ ఆర్. విహారి.