Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'చిత్రలహరి', 'ప్రతిరోజూ పండగే', 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్న కథానాయకుడు సాయితేజ్. ఆయన హీరోగా 'ప్రస్థానం' వంటి భిన్న చిత్రాన్ని తెరకెక్కించిన దేవా కట్టా దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి 'రిపబ్లిక్' అనే టైటిల్ను ఖరారు చేశారు. జె.బి.ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ పతాకాలపై ఈ చిత్రాన్ని జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్ను చిత్ర యూనిట్ సోమవారం విడుదల చేసింది.
'యువరానర్.. ప్రజలు ఎన్నుకున్న రాజకీయ నాయకులు.. శాసనాలను అమలు చేసే ప్రభుత్వోద్యోగులు.. న్యాయాన్ని కాపాడే కోర్టులు... ఈ మూడు గుర్రాలు ఒకరి తప్పులు.. ఒకరు దిద్దుకుంటూ క్రమబద్దంగా సాగినప్పుడే అది ప్రజాస్వామ్యమవుతుంది. ప్రభుత్వమవుతుంది....అదే అసలైన రిపబ్లిక్' అంటూ సాయితేజ్ వాయిస్లో టైటిల్ అర్థాన్ని చెప్పి మోషన్ పోస్టర్ను చిత్ర బృందం డిఫరెంట్గా డిజైన్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు మాట్లాడుతూ,''రిపబ్లిక్' అనే పవర్ఫుల్ టైటిల్తో సాయితేజ్ హీరోగా, దేవా కట్టా దర్శకత్వంలో రూపొందుతోన్న మా సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ ఏడాది సమ్మర్లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా సన్నాహాలు చేస్తున్నాం. మా బ్యానర్లో ఓ మంచి సినిమాని నిర్మిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా బ్యానర్కి మంచి గుర్తింపు తెచ్చే సినిమా అవుతుందనే నమ్మకం ఉంది' అని చెప్పారు. సాయితేజ్, ఐశ్వర్యా రాజేశ్, జగపతిబాబు, రమ్యకష్ణ, సుబ్బరాజు, రాహుల్ రామకష్ణ, బాక్సర్ దిన తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్ప్లే: దేవా కట్టా, కిరణ్ జరు కుమార్, సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్, మ్యూజిక్: మణిశర్మ, ఎడిటర్: కె.ఎల్.ప్రవీణ్, ఆర్ట్: శ్రీకాంత్ రామిశెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సతీశ్ బీకేఆర్, పాటలు: సుద్దాల అశోక్ తేజ, రెహమాన్, నిర్మాతలు: జె.భగవాన్, జె.పుల్లారావు, కథ, మాటలు, దర్శకత్వం: దేవా కట్టా.