Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'సర్కారు వారి పాట'. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ ఎస్.ఎస్. సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ చిత్రీకరణ సోమవారం దుబాయ్ లో ప్రారంభమైంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ 'ది ఆక్షన్ అండ్ ది యాక్షన్ బిగిన్స్' అంటూ ఒక వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఈ సందర్భంగా దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ, 'సూపర్స్టార్ మహేష్బాబుని డైరెక్ట్ చేయాలన్న ఇన్నేళ్ళ నా కల ఈ రోజు నిజమైంది. మహేష్బాబుతో వర్క్ చేయడం చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఈ మూవీని ఒక ఛాలెంజింగ్ తీసుకుని చేస్తున్నాను. డెఫినెట్గా ప్రేక్షకులు, మహేష్ బాబు అభిమానుల అంచనాలకు తగినట్లుగా ఈ సినిమా పెద్ద స్థాయిలో ఉంటుంది. ఇరవై రోజుల పాటు దుబాయ్ లో ఫస్ట్ షెడ్యూల్ జరగనుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం' అని చెప్పారు. వెన్నెల కిషోర్, సుబ్బరాజు వంటి భారీ తారాగణం నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం: తమన్ ఎస్.ఎస్, సినిమాటోగ్రఫి: మధి, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్: ఏ ఎస్ ప్రకాష్, ఫైట్ మాస్టర్: రామ్ - లక్ష్మణ్, లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్, నిర్మాతలు: నవీన్ ఎర్నేని , రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట, రచన, దర్శకత్వం: పరశురామ్ పెట్ల.