Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'చెక్' చిత్రంలోని నేను నటించిన లాయర్ మానస పాత్ర చాలా బాగుందని, నాలోని కొత్త యాంగిల్ని చూశామని చాలా మంది సోషల్ మీడియాలో నాకు పోస్ట్ లు పెడుతున్నారు. సినిమాకి, నా పాత్రకి ఇంత మంచి స్పందన రావడం చాలా హ్యాపీగా ఉంది' అని అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. విలక్షణ చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మార్క్ కథ, కథనాలతో వచ్చిన 'చెక్' సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ఓ హీరోయిన్. యూత్ స్టార్ నితిన్ కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మించిన 'చెక్'లో ఆమె పాత్ర రెగ్యులర్ హీరోయిన్ పాత్రలకు భిన్నమైనది. హీరోతో పాటలు, రొమాన్స్ చేసే పాత్ర కాకుండా న్యాయవాదిగా తనదైన నటనతో మెప్పించారు. శుక్రవారం (ఈ నెల 26న) 'చెక్' విడుదలైంది. ఈ సందర్భంగా సినిమాకు, తన పాత్రకు వస్తున్న స్పందన పట్ల రకుల్ ప్రీత్ సింగ్ పాత్రికేయులతో ముచ్చటించారు. ప్రస్తుతం హైదరాబాద్లో లేను. ముంబైలో ఉన్నాను. హిందీ సినిమా చిత్రీకరణ చేస్తున్నా. అందువల్ల, నేనింకా సినిమా చూడలేదు. నేరుగా ప్రేక్షకుల స్పందన తెలుసుకోలేకపోయా. అయితే, నాకు తెలిసిన కొంతమంది సినిమా చూశారు. వాళ్లకు నచ్చింది. సోషల్ మీడియాలో చాలామంది పోస్టులు చేశారు. అవీ చూశా. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో 'చెక్' బావుందని చాలామంది కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. సినిమాతో పాటు నా పాత్ర మానస ప్రేక్షకులకు బాగా నచ్చింది. జైలులో ఓ ఖైదీపై నేను అరిచే సన్నివేశం, పతాక సన్నివేశాల్లో జైలులో నితిన్ను కలిసి ఎమోషనల్ అయ్యే సన్నివేశం గురించి ప్రేక్షకులు మాట్లాడుతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. కరోనాకి ముందు ప్రారంభించిన సినిమా. లాక్డౌన్ వల్ల కాస్త ఆలస్యమైంది. యూనిట్ అంతా కష్టపడి చేశాం. ప్రేక్షకుల మద్దతు ఉంటుందని ఆశిస్తున్నా. కథ వినేటప్పుడు... ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలకు కొంచెం భిన్నంగా ఉందా? లేదా? అని ఆలోచిస్తా. మాసన పాత్ర విన్నప్పుడు... తనొక సాధారణ న్యాయవాది కాదు. జైలుకు వెళ్లడానికి ఆమె భయపడుతుంది. క్రిమినల్ను చూసి హార్ట్బీట్ పెరుగుతుంది. భయాన్ని దాటి ఆ కేసును టేకప్ చేసి వాదిస్తుంది. మానస క్యారెక్టర్లో ట్రాన్స్ఫర్మేషన్ నాకు నచ్చింది. ఆవిడలో మార్పు వస్తుంది. ఎప్పుడైనా సరే సినిమా ప్రారంభంలో క్యారెక్టర్ ఓ విధంగా ఉండి, పోను పోనూ మార్పు వస్తే... అటువంటి క్యారెక్టర్లలో నటించేటప్పుడు ఎంజారు చేయవచ్చు' అని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పారు.