Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' వంటి హిట్ చిత్రంతో మెప్పించిన నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'జాతిరత్నాలు'. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అనుదీప్ దర్శకత్వం వహిస్తుండగా, స్వప్న సినిమాస్ పతాకంపై అనుదీప్ దర్శకత్వంలో ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించారు. ఈ సినిమా మార్చి 11న విడుదల కానుంది. ఈ సందర్బంగా చిత్ర టీజర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. నిర్మాత నాగ్ అశ్విన్ మాట్లాడుతూ, 'అనుదీప్ షార్ట్ ఫిల్మ్ చూశాను. అది చాలా యూనిక్ కామెడీతో నాకు బాగా నచ్చింది. 'మహానటి' టైంలో అనుదీప్ కలిశాడు. పూర్తి కామెడీ తరహా స్క్రిప్ట్ చెప్పాడు. వినేటప్పుడే విపరీతంగా ఎంజారు చేశాను. వెంటనే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం.నాకు జంధ్యాల, ఈవివి, యస్వీ కృష్ణారెడ్డి గారి చిత్రాలంటే ఇష్టం. అలాంటి ఫన్ ఫిల్మ్ ఈ 'జాతిరత్నాలు'. ఎంత కష్టపడి కామెడీ చేసినా ఒక్కోసారి అంతగా పండదు. ఇంకోసారి నేచురల్ గా చేసినా బాగా పండుతుంది. ఇది రెండో జోనర్ కి చెందుతుంది. ఒక స్పెషల్ ప్రొడక్ట్ 'జాతిరత్నాలు'ను ప్రేక్షకులకు అందిస్తున్నాం. సెటైరికల్ సినిమా. ప్రతి క్యారెక్టర్లో యూనిక్ నెస్ ఉంటుంది' అని అన్నారు. హీరో నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ, 'నాకిది మూడో సినిమా. అనుదీప్ స్క్రిప్ట్ నేరేట్ చేస్తున్నప్పుడే విపరీతంగా ఎంజారు చేశాను. వైజయంతి, స్వప్న సినిమాస్ బ్యానర్లో ఈ సినిమా చేయడం అదష్టంగా భావిస్తున్నాను. కంప్లీట్ ఔట్ అండ్ ఔట్ హిలేరియస్ ఎంటర్టైనర్ చిత్రం ఇది. ప్రతీ ఒక్కర్నీ కడుపుబ్బా నవ్విస్తుంది' అని చెప్పారు. ఇందులో అనుదీప్, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా )పాల్గొన్నారు.