Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా, నూతన దర్శకుడు కిషోర్ బి దర్శకత్వంలో 14రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'శ్రీకారం'. మిక్కీ జె. మేయర్ ఈ చిత్రానికి స్వరాలను సమకూర్చారు. ఈ చిత్ర టైటిల్ సాంగ్ని శుక్రవారం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ, '14 రీల్స్ రామ్, గోపీ నాకెంతో ఇష్టమైన ప్రొడ్యూసర్స్. మా రాంజో బ్యూటిఫుల్ లిరిక్స్ రాశారు. ఈ చిత్రంలోని 4వ పాట, టైటిల్ సాంగ్ నా చేతులమీదుగా లాంచ్ అవడం హ్యాపీగా ఉంది. టీజర్, స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. వ్యవసాయం చేసేవాళ్ళు నెత్తిమీద జుట్టంత ఉంటే దానిని పండించేవాళ్ళు మూతి మీద మీసం అంత మంది ఉన్నారు. ఆ డైలాగ్ సూపర్బ్ గా ఉంది. నాకు తెల్సి నెక్స్ట్ ప్రపంచానికి బిగ్ థింగ్ వ్యవసాయం. వ్యవసాయం ఎంతో పాతది అయినా దానిమీద ఆధారపడి కొన్నివేల సంవత్సరాల నుండి బ్రతుకుతున్నాం. జనాభా పెరిగే కొద్దీ తినేవాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అలాంటప్పుడు వ్యవసాయం లాభసాటిగా మారాలి. కానీ నష్టాల్లో కూరుకుపోతుంది. దానికి సొల్యూషన్ చెప్పడానికి దర్శకుడు కిషోర్ శ్రీకారం ద్వారా ప్రయత్నం చేశాడు. ఒక పాత పద్ధతికి స్వస్తి చెప్పి కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టబోతున్నారు' అని అన్నారు. 'వ్యవసాయంతోపాటు ఒక తండ్రి కొడుకుల మధ్య రిలేషన్, లవ్ ఫెయిల్యూర్, మనకి, మన ఊరికి వచ్చిన చిన్న గ్యాప్ ని ఎలా ఫుల్ ఫిల్ చేయొచ్చో ఈ చిత్రంలో చూపించాం. ప్రతీ ఒక్కరూ ఆలోచింప జేసే విధంగా చాలా విషయాలను చూపించబోతున్నాం. మార్చి 11న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది' అని దర్శకుడు కిషోర్ చెప్పారు.