Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అశ్వద్ధామ ప్రొడక్షన్స్ పతాకంపై బైరి దీపక్ సిద్ధాంత్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ బి.సుశీల నిర్మిస్తున్న డార్క్ థ్రిల్లర్ 'జి.టి.ఎ' (గన్స్-ట్రాన్స్-యాక్షన్).
చైతన్యకృష్ణ, హీనా రాయ్, సుదర్శన్, శరత్ చంద్ర, రాఖీ, శ్రీకాంత్ అయ్యంగార్, రూపాలక్ష్మి కుమనన్ ముఖ్య తారాగణంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆదివారం ఉదయం రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఘనంగా మొదలైంది. చైతన్యకృష్ణ, సుదర్శన్, రాకీపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కె.ఎల్.దామోదర్ప్రసాద్ క్లాప్నివ్వగా, 'బజార్ రౌడీ' నిర్మాత సందిరెడ్డి శ్రీనివాసరావు కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా మీడియా సమావేశంలో నిర్మాత డాక్టర్ సుశీల దర్శకుడు బైరి దీపక్ సిద్ధాంత్, చైతన్యకృష్ణ, సుదర్శన్, రాకీ, శరత్ చంద్ర, కుమరన్, హీరోయిన్ హీనా రాయ్, సంగీత దర్శకుడు మార్క్ కె.రాబిన్, కెమెరామెన్ కె.వి.ప్రసాద్, ఎడిటర్ గ్యారీ, ప్రముఖ విద్యావేత్త పి.బి.వి.సుబ్బయ్య తదితరులు పాల్గొని చిత్ర విశేషాలను తెలిపారు.
'తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు తెరకెక్కని అత్యంత వైవిధ్యమైన కథ, కథనాలతో డార్క్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. దీని కోసం అద్భుతమైన టీమ్ సెట్ అయ్యింది' అని దర్శక, నిర్మాతలు పేర్కొన్నారు.