Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీరామ్, రాహుల్ రామకృష్ణ, అక్షయ చందర్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం 'వై'. బాలు అడుసుమిల్లి దర్శకుడు. ఏరుకొండ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో జక్కంపూడి గణేష్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా, యేరుకొండ రఘురాం, శ్రీనివాస్ వేగి, మురళి మాటూరు సంయుక్తంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. తెలుగు మోషన్ పోస్టర్ను నిర్మాత బన్నీ వాసు విడుదల చేశారు. తమిళ మోషన్ పోస్టర్ను తమిళ అగ్ర హీరో ఆర్య రిలీజ్ చేేశారు.
ఈ సందర్భంగా నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ,' ఈ చిత్ర మోషన్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. సినిమా ఇంకా ఆసక్తికరంగా ఉంటుందనే నమ్మకం ఉంది. రెండు భాషల్లోనూ ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. టిఎన్ఆర్, జెమిని సురేష్, రఘుబాబు, కత్తి మహేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు: యేరుకొండ రఘురాం, శ్రీనివాస్ వేగి, మురళి మాటూరు, సమర్పణ: జక్కంపూడి గణేష్, ఎడిటర్: చోటా.కె.ప్రసాద్, సంగీతం: వికాస్ బడిస, సినిమాటోగ్రఫీ: దర్శన్, రచన - దర్శకత్వం: బాలు అడుసుమిల్లి.