Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళల ఫై జరుగుతున్న అఘాయిత్యాలు ఎంత ఘోరంగా ఉంటున్నాయో అందరికి తెలిసిందే. దానికి ప్రత్యక్ష సాక్ష్యం.. ఐటి యుగంలో ఉన్నా కూడా దేశంలో ప్రతి ఐదు నిమిషాలకు ఒక అమ్మాయిపై అఘాయిత్యం జరుగుతూనే ఉంది. ఇంకా మగాళ్ల దాడిలో మహిళ బలి అవుతూనే ఉంది. ఈ అఘాయిత్యాలకు అంతే లేదా? అనే కోణంలో ఓ మహిళ తన జీవితాన్ని చిద్రం చేసిన ఓ మానవ మగంపై తీర్చుకున్న పగ నేపథ్యంలో తెరకెక్కిన లఘు చిత్రం 'భూమి'. నజియా షేక్, అరుణ్ బాబు, సతీష్ సారిపల్లి, లక్ష్మి కళ్యాణి ముఖ్య పాత్రల్లో రాఘవేంద్ర కటారి దర్శకత్వంలో నజియా షేక్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నజియా షేక్ నిర్మించారు. ఈ లఘు చిత్రాన్ని ప్రసాద్ ల్యాబ్లో ప్రదర్శించారు. హీరో సుధాకర్ కొమాకుల, దర్శకులు హరినాధ్ బాబు, యోగి కుమార్, జనార్దన్ ఎడ్వార్డ్ యోయో ముకుంద్, నిర్మాత రాజీవ్ తదితరులు ఈ లఘు చిత్రాన్ని చూసి యూనిట్ని అభినందించారు.
ఈ సందర్బంగా లీడ్ రోల్ పోషించిన నజియా షేక్ మాట్లాడుతూ,'ఒక బాధితురాలి వేదన ఎలా ఉంటుందనే కోణంలో ఈ కథ ఉంటుంది' అని చెప్పారు. దర్శకుడు రాఘవేంద్ర మాట్లాడుతూ, 'ఒక అమ్మాయి రేప్కి గురైన నాలుగేళ్ళ తరువాత ఇన్ఫెక్షన్స్ వచ్చి ఎంత బాధ పడిందో విన్నాను. అందుకే ఆ పెయిన్ని ఇందులో చూపించాను' అని చెప్పారు. యువ హీరో సుధాకర్ కొమాకుల మాట్లాడుతూ, 'ఇలాంటి కథలో నటించిన నజియాని చూశాక ఆమెపై చాలా గౌెరవం పెరిగింది. మహిళల ఆవేదనకు ప్రతిబింబమిది. నేషనల్ అవార్డ్తోపాటు మరెన్నో అవార్డులు దీనికి రావాలి.' అని చెప్పారు.