Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా 'లవ్ స్టోరి'. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. లేటెస్ట్గా రిలీజ్ చేసిన ఈ చిత్రంలోని 3వ పాట 'సారంగ దరియా' పాట విశేష ఆదరణ పొంది, 24 గంటల్లో 6 మిలియన్ వ్యూస్కి పైగా రాబట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ పాటకు కొరియోగఫ్రీ చేసిన శేఖర్ మాస్టర్ సోమవారం మీడియాతో తన సంతోషాన్ని షేర్ చేసుకున్నారు. 'ఈ సినిమాలో రెయిన్ పాట, సారంగ దరియా పాటలతోపాటు రెండు బిట్ సాంగ్స్ చేశాను. సాయి పల్లవి ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా బాగుంటుంది. మేం చెప్పిన మూవ్మెంట్స్ను ఇంకా బాగా చేసి చూపించింది. మాలాంటి డాన్స్మాస్టర్లకు సాయిపల్లవి లాంటి హీరోయిన్ దొరకడం అదృష్టం. శేఖర్ కమ్ముల గారు ఇది జానపదం స్టయిల్లో ఉండే పాట కాబట్టి స్టెప్స్ ఎలా ఉండాలో చెప్పారు. సాయిపల్లవి ఉండటం వల్ల ఇంకా సాంగ్ హైప్ అయ్యింది. ఈ పాట ఇంత పెద్ద హిట్ అవడం నాకు ఆశ్చర్యంగానే ఉంది. 'ఫిదా'లో సాయి పల్లవితో 'వచ్చిండే..' చేసేప్పుడు ఏ అంచనాలు లేవు. కానీ ఈ పాటకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈ సినిమాలో జుంబా డాన్స్లు నాగచైతన్య మీద ఉంటాయి. ఆయన జుంబా ట్రైనర్. చిన్న చిన్న బిట్స్ ఉంటాయి. 'ఖైదీ నెంబర్ 150', 'ఫిదా' రెండూ ఒకే టైమ్లో చేశాను. రెండూ భిన్నమే. ఇలాంటివి సంతప్తినిస్తాయి. నాకూ యాక్టింగ్ అవకాశాలు వచ్చాయి. కానీ నాకు ఇష్టం లేదు. త్వరలో డైరెక్షన్ చేస్తానేమో. మా బాబు బాల నటుడిగా చేస్తున్నాడు. ప్రస్తుతం 'పుష్ప', 'ఆచార్య'తో పాటు మరికొన్ని చిత్రాలకు కొరియోగ్రఫీ చేస్తున్నా' అని శేఖర్ మాస్టర్ తెలిపారు.