Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ్ తరుణ్, కొండా విజయ్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'పవర్ ప్లే'. శ్రీమతి పద్మ సమర్పణలో వనమాలి క్రియేషన్స్ ప్రై.లి పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మహిదర్, దేవేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సమ్మర్ స్పెషల్గా మార్చి 5న వరల్డ్వైడ్గా ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ చిత్ర బిగ్ టికెట్ను తెలంగాణ టూరిజం ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, నిర్మాతలు కె.ఎస్.రామారావు, కె.కె.రాధామోహన్ సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత దేవేష్ మాట్లాడుతూ, 'సినిమా చాలా బాగా వచ్చింది. సక్సెస్మీట్లో మళ్లీ కలుద్దాం' అని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పాలమర్తి అనంత్ సాయి మాట్లాడుతూ, 'రాజ్ తరుణ్ ఫుల్ సపోర్ట్ చేశారు. మార్చి 5న మిమ్మల్ని కచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాం' అని చెప్పారు.
చిత్ర దర్శకుడు విజయ్ కుమార్ కొండా మాట్లాడుతూ, 'రాజ్, నేను ఇంతవరకూ చేయని ఒక కొత్త జోనర్. ఇది ఒక మ్యూజికల్ సినిమా. కెమెరా పరంగా మేకింగ్ స్టైలిష్గా ఉండే సినిమా. ఇప్పటి వరకూ కామెడీ చేసిన నటుల్ని కొత్తగా ఆవిష్కరించే సినిమా. సినిమా సూపర్డూపర్ హిట్' అని అన్నారు. 'విజయ్, నంద్యాల రవి, మధునందన్ కలిసి అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ చేశారు. ఈ సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది' అని హీరో రాజ్ తరుణ్ అన్నారు.