Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగార్జున, దియా మీర్జా, సయామీ కేర్, అతుల్ కులకర్ణి, ఆలీ రెజా ముఖ్య పాత్రధారులుగా రూపొందిన చిత్రం 'వైల్డ్ డాగ్'. మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అహిషోర్ సొలోమన్ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన చిత్రమిది. రియలిస్టిక్ ఇన్సిడెంట్స్తో రూపొందిన ఈ చిత్రం సమ్మర్ కానుకగా ఏప్రిల్ 2న వరల్డ్ వైడ్గా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సోమవారం పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, 'ఇది మనందరికీ సంబంధించిన కథ. హైదరాబాద్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్, టెర్రరిస్ట్ నేపథ్యంలో సాగుతుంది. ఆ బాంబ్ బ్లాస్ట్ చేసిన వాళ్ళు ఎక్కడున్నారు?, వారిని ఎలా పట్టుకున్నారనేది రియల్ ఇన్సిడెంట్స్తో తీశాం. ఒక చక్కని పుస్తకంలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. డిఫరెంట్ జోనర్స్లో మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని నిరంజన్ గట్టి నమ్మకం. అందుకే ఆయన 'క్షణ క్షణం', 'ఘాజి', 'గగనం' తీశారు. అవన్నీ మంచి సక్సెస్ అయ్యాయి. తెలుగు సినిమా మీనింగ్ ఫుల్గా ఉండాలి అని సాహసంతో ఈ చిత్రాన్ని నిర్మించారు' అని అన్నారు.
చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ,'రియలిస్టిక్ ఇన్సిడెంట్స్తో డిఫరెంట్ అప్రోచ్తో సాగే సినిమా ఇది. ఇదొక ఎన్ఐఎ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్లో ఎలా సక్సెస్ అయ్యారు?, వారి లైఫ్ ఎలా ఉంటుందనే అంశాలను ఈ చిత్రంలో చూపించాం' అని చెప్పారు. దర్శకుడు అహిషోర్ సొలోమన్ మాట్లాడుతూ, 'స్క్రిప్ట్ వినగానే నాగార్జున చాలా బాగుంది అన్నారు. అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. మార్చి10న ట్రైలర్ రిలీజ్ అవుతుంది' అని తెలిపారు.