Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ సేతుపతి హీరోగా, సాయేషా సైగల్, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా గోకుల్ (కాష్మోరా చిత్రం ఫేమ్) దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'విక్రమార్కుడు'. ( ది రియల్ డాన్ అనేది ట్యాగ్ లైన్). వాయల శ్రీనివాసరావు సమర్పణలో ఆర్.కె.వి.కంబైన్స్ వాణి వెంకటరమణ సినిమాస్, క్రాంతి కీర్తన పతాకాలపై నిర్మాతలు కాకర్లమూడి రవీంద్ర కళ్యాణ్, అప్పసాని సాంబశివరావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్ర ప్రీ- రిలీజ్ వేడుక ప్రసాద్ ల్యాబ్లో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన దర్శకుడు, కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్, ఆయన సతీమణి రాధ రాజశేఖర్, దర్శకుడు సూర్య కిరణ్ చిత్ర పోస్టర్స్ను విడుదల చేశారు. దర్శకుడు వీరశంకర్ టీజర్ను ఆవిష్కరించగా, చిత్ర సమర్పకులు వాయల శ్రీనివాసరావు ట్రైలర్ను రిలీజ్ చేేశారు. పాటలను నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, శ్రీరంగం సతీష్ కుమార్ విడుదల చేశారు. 'ఫ్యామిలీ ప్రేక్షకులంతా చూడదగ్గ నవరసాలు ఉన్న మంచి వినోదాత్మక చిత్రమిది. అన్ని ఏరియాల్లో అద్భుతంగా బిజినెస్ జరిగింది. ఈ సినిమాని ఎక్కువ థియేటర్లలో విడుదల చేస్తున్నాం' అని చిత్ర సమర్పకులు వాయల శ్రీనివాసరావు తెలిపారు.
నిర్మాతలు మాట్లాడుతూ, 'మొదటి నుంచి విజరు సేతుపతికి మేం పెద్ద అభిమానులం. ఈ సినిమా చూసిన తరువాత మేం గోకుల్కు ఫ్యాన్ అవ్వాలా లేక విజయ్ సేతుపతికి ఫ్యాన్ అవ్వాలా అర్థం కాలేదు. ఎందుకంటే విజయ్ సేతుపతిని చాలా హై బడ్జెట్లో, హై రేంజ్లో చాలా బాగా చూపించిన డైరెక్టర్ గోకుల్. అందుకే మేం ఆయన ఫ్యాన్ కూడా అయ్యాం. ఈ చిత్రాన్ని ఈనెల 5న భారీగా 500 థియేటర్స్లో విడుదల చేస్తున్నాం' అని అన్నారు. చిత్ర దర్శకుడు గోకుల్ మాట్లాడుతూ, 'ఒకే స్కూల్లో చదివిన మేం డైరెక్టర్స్గా ఒకే వేదికపై కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మంచి సినిమాని తీస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే విషయాన్ని గతంలో నేను తీసిన 'కాష్మోరా' నిరూపించింది. అందుకే తెలుగు ప్రేక్షకులంటే నాకెంతో ఇష్టం. ఈ సినిమాని కూడా అదరిస్తారని ఆశిస్తున్నాను' అని చెప్పారు.