Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నేటి సమాజానికి వెండితెర రూపమే 'జాతిరత్నాలు' సినిమా. హీరోయిన్ కావాలనే నా కలని ఈ సినిమా నిజం చేసింది' అని కథానాయిక ఫరియా అబ్దుల్లా అంటోంది. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకష్ణ, ప్రియదర్శి టైటిల్ రోల్స్ పోషించిన చిత్రం 'జాతిరత్నాలు'. అనుదీప్ కె.వి.దర్శకుడు.
స్వప్న సినిమా బ్యానర్పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించింది. ఈనెల 11న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో కథానాయిక ఫరియా సోమవారం మీడియాతో మాట్లాడుతూ,'మోడలింగ్ తర్వాత థియేటర్ ఆర్టిస్ట్గా 50 షోలు చేశాను. ఆ తర్వాత 'నక్షత్ర' అనే క్రైమ్ వెబ్ సిరీస్లో యాక్ట్ చేశాను. నిర్మాత నాగ్ అశ్విన్ ఓ రోజు మా కాలేజ్ ఫెస్ట్కి వచ్చారు. ఆయనతో ఏర్పడిన పరిచయమే ఈ సినిమాలో హీరోయిన్గా అవకాశం తీసుకొచ్చింది. ఇందులో చిట్టి అనే పాత్రలో నటించాను. నాపాత్ర అందరినీ అలరిస్తుంది. అలాగే మరిన్ని అవకాశాలను తీసుకొస్తుందనే నమ్మకం ఉంది. ప్రస్తుత సమాజాన్ని వ్యంగ్యంగా చూపించే ప్రయత్నమిది. అందరూ హ్యాపీగా నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుంది' అని తెలిపింది.