Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కిస్తున్న చిత్రం 'చావు కబురు చల్లగా'. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఈనెల 9న వైభవంగా జరగబోతోంది. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా అల్లు అర్జున్ విచ్చేస్తున్నట్లుగా చిత్ర నిర్మాత బన్నీవాసు ప్రకటించారు. ఈనెల 9న హైదరాబాద్ జేఆర్సి ఫంక్షన్ హాల్లో భారీ స్థాయిలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని బన్నీవాసు తెలిపారు.అభిమానుల్ని ప్రొత్సహించడంలో ఎప్పుడూ ముందుండే అల్లుఅర్జున్ ప్రస్తుతం 'పుష్ప' చిత్రీకరణలో బిజీగా ఉన్నప్పటికీ 'చావు కబురు చల్లగా' టీమ్ కోసం తన సమయాన్ని ఇచ్చి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిధిగా రావడానికి అంగీకరించినందుకు చాలా ఆనందంగా ఉన్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈనెల 19న విడుదల కానుంది. ఈ సినిమాలోని పాటలను ఆదిత్య మ్యూజిక్ వారు విడుదల చేస్తున్నారు.
కార్తీకేయ, లావణ్య త్రిపాఠి, ఆమని,మురళి శర్మ, రజిత, భద్రం, మహేష్, ప్రభు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్- సత్య జి, ఆర్ట్ - జి ఎమ్ శేఖర్, మ్యూజిక్ - జేక్స్ బిజారు, సినిమాటోగ్రాఫర్ - కరమ్ ఛావ్లా, అడిషినల్ డైలాగ్స్ - శివ కుమార్ భూజుల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్- రాఘవ కరుటూరి, శరత్ చంద్రనాయుడు.