Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నా కెరీర్లోనే కొత్త జోనర్లో ట్రై చేసిన సినిమా 'పవర్ ప్లే'. ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది' అని అంటున్నారు యువ కథానాయకుడు రాజ్ తరుణ్. విజయ్ కుమార్ కొండా దర్శకుడు. 'ఒరేయ్ బుజ్జిగా' తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా రాజ్తరుణ్ మాట్లాడుతూ, 'అధికారంలో ఉన్న కొంత మంది వ్యక్తులు వేసిన ఎత్తుగడలో ఓ అమాయకుడు చిక్కుకుంటే ఏం జరిగింది? అనేదే ఈ సినిమా' అని చెప్పారు.