Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం 'రంగ్ దే'. ఈ చిత్రంలోని ఓ పాటను గురువారం అగ్ర కథానాయకుడు మహేష్ బాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు. పాట ఎంతో బాగుందని చిత్ర యూనిట్కు అభినందనలు తెలిపారు. 'నా కనులు ఎపుడూ కననే కనని.. హదయ మెపుడూ విననే వినని' అంటూ చిత్ర కథానుసారం సందర్భోచితంగా వచ్చే ఈ పాటకు శ్రీమణి సాహిత్యం సమకూర్చారు. సిద్ శ్రీరామ్ ఈ పాటను ఎంతో అద్భుతంగా పాడారు. ఈ గీతానికి దేవిశ్రీ ప్రసాద్ అందించిన స్వరాలు సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తున్నాయి. చిత్ర కథానుసారం నితిన్, ప్రధాన తారాగణంపై చిత్రీకరించిన సందర్భోచిత పాట ఇది. వెండితెరపై వీక్షకులకు కనువిందు కలిగేలా ఈ పాటను దర్శకుడు వెంకీ అట్లూరి చిత్రీకరించారు. సూపర్ స్టార్ మహేష్బాబు తమ చిత్రంలోని పాటను విడుదల చేయటం పట్ల సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందం తమ సంతోషాన్ని, కతజ్ఞతలను తెలియచేశారు. 'ఈనెల 26న విడుదల అవుతున్న ఈ చిత్రం సకుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రంగా దర్శకుడు వెంకీ అట్లూరి రూపకల్పన చేశారు' అని చిత్ర బృందం తెలిపింది. సితార ఎంటర్టైన్మెంట్స్' నిర్మిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: పి.డి.వి.ప్రసాద్, నిర్మాత:సూర్యదేవర నాగవంశి, రచన, దర్శకత్వం: వెంకీ అట్లూరి.