Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'జాతిరత్నాలు'. అనుదీప్ కె.వి. దర్శకుడు. స్వప్న సినిమా బ్యానర్పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించింది. గురువారం ఈ చిత్ర ట్రైలర్ను అగ్ర కథానాయకుడు ప్రభాస్ ముంబైలో రిలీజ్ చేేశారు. హీరో, హీరోయిన్లు నవీన్ పోలిశెట్టి, ఫరియా అబ్దుల్లా, ప్రియదర్శి, డైరెక్టర్ అనుదీప్ తదితరులు ముంబైలో ఉన్న ప్రభాస్ నివాసానికి వెళ్లి మరీ ఆయన చేతుల మీదుగా ట్రైలర్ను రిలీజ్ చేయించడం విశేషం. నవీన్ పోలిశెట్టిది జోగిపేట. అందుకే 'జోగిపేట - ముంబై' అంటూ ఓ వీడియోను రూపొందించి, తామెలా ప్రభాస్ను కలుసుకున్నామో వినోదాత్మకంగా చూపించిందీ చిత్ర బృందం.
'టీజర్ నాకు నచ్చింది. కానీ ట్రైలర్ ఎక్స్ట్రార్డినరీగా ఉంది. ట్రైలర్ చూసి పదిసార్లు నవ్వానంటే, సినిమా ఇంకెంతసేపు నవ్విస్తుందో ఊహించు కోవాల్సిందే. సినిమా అంతా హిలేరియస్గా ఉంటుందని అనుకుంటున్నాను. కోవిడ్ తర్వాత ఫ్యామిలీ అంతా వెళ్లి హాయిగా నవ్వుకుంటూ ఎంజారు చేసే సినిమా' అని ప్రభాస్ చెప్పారు. 'టీజర్ చూసినప్పుడు ఈ సినిమా కథ రూ.500 కోట్ల చుట్టూ నడుస్తుందని అర్థమైంది. ట్రైలర్ మొదలైన దగ్గర్నుంచీ ముగిసే దాకా నవ్విస్తూనే ఉంది. దీన్ని బట్టి ప్రభాస్ చెప్పినట్లు ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకుల్ని పొట్టచెక్కలయ్యేలా నవ్వించడం ఖాయమనిపిస్తోంది. ఈనెల 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది' అని చిత్ర బృందం తెలిపింది. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, మురళీ శర్మ, నరేష్ వి.కె., బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి రచన-దర్శకత్వం: అనుదీప్ కె.వి., నిర్మాత: నాగ్ అశ్విన్.