Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అరవింద్ కృష్ణ, శ్రీజితా ఘోష్ జంటగా నటించిన చిత్రం 'శుక్ర'. సుకు పూర్వజ్ దర్శకుడు. అయ్యన్న నాయుడు నల్ల, తేజ పల్లె నిర్మాతలు. ఈ నెల 23న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శక, నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, 'ఇట్స్ మై లవ్ స్టోరి' తర్వాత అరవింద్ కృష్ణ మంచి యాక్షన్ ఫిల్మ్తో మీ ముందుకొస్తున్నాడు. దర్శకుడు సుకు పూర్వజ్ అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కించారు. టెక్నికల్గా చాలా మంచి సినిమాగా పేరు తెచ్చుకుంటుంది' అని అన్నారు. దర్శకుడు సుకు పూర్వజ్ మాట్లాడుతూ, 'సినిమా చూసి మధుర శ్రీధర్ రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చారు. ఆయన మాకు ఇస్తున్న సపోర్ట్ మర్చిపోలేం. ఇందులో ఓ కొత్త తరహా నటనను అరవింద్లో చూస్తారు. నాయిక శ్రీజిత సినిమా కోసం చాలా కష్టపడింది. యూట్యూబ్లో మా సినిమా ట్రైలర్, పాటలు ఉన్నాయి. మీకు ఏమాత్రం కొత్తగా అనిపించినా థియేటర్కి వచ్చి సినిమా చూడండి. ఓ కొత్త సినిమా చూసిన ఫీలింగ్ తప్పకుండా కలుగుతుంది' అని తెలిపారు. 'నా పాత్రకు న్యాయం చేయగలనని దర్శకుడు సుకు పూర్తిగా నమ్మారు. తెలుగులో నా తొలి సినిమా ఇది. అందుకే ఇది చాలా స్పెషల్. ఇదొక డిఫరెంట్ మూవీ. డిఫరెంట్ ఎమోషన్స్ చూస్తారు' అని నాయిక శ్రీజిత ఘోష్ చెప్పారు. హీరో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ, 'నటుడిగా నాకు ఈ సినిమా పునర్జన్మ లాంటింది. ప్రొఫెషనల్ బాస్కెట్ బాల్ ప్లేయర్గా అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నాను. దాంతో నటనకు కొంత దూరం అవ్వాల్సి వచ్చింది. ఇకపై వరుసగా సినిమాలు చేయాలని ఉంది. 'శుక్ర' ఒక న్యూ ఏజ్ మూవీ. ప్రేక్షకులు కొత్త తరహా కాన్సెప్ట్స్ కావాలని కోరుకుంటున్నారు. అలాంటి చిత్రమే ఇది. ఇందులో రొమాన్స్, క్రైమ్, లస్ట్, రివేంజ్.. ఇలా అన్నింటితో ఆడియెన్స్కు ఫుల్ మీల్స్లా ఉంటుంది' అని చెప్పారు. నిర్మాత తేజ పల్లె మాట్లాడుతూ, 'ఏడాదిన్నరగా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని, సినిమాని పూర్తి చేశాం. సినిమా అనుకున్నట్లు చాలా బాగా వచ్చింది' అని తెలిపారు. 'డిఫరెంట్ సెచ్చ్యువేషన్లో ఈ సినిమాను స్టార్ట్ చేశాం. సినిమా కొత్త పంథాలో సాగుతుంది' అని సినిమాటోగ్రాఫర్ జగదీశ్ బొమ్మిశెట్టి చెప్పారు.