Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'మహా సముద్రం'. అజరు భూపతి దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సుంకర రామబ్రహ్మం నిర్మించారు. దసరా కానుకగా నేడు (గురువారం) ఈ సినిమా విడుదలవుతోంది. ఈసందర్భంగా నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ,'కోవిడ్ తర్వాత ఓవర్సీస్లో భారీ ఎత్తున విడుదలవుతున్న చిత్రం మాదే. దసరాకి విడుదలైన 'దూకుడు' చిత్రంతో నాకెలాంటి మంచి పేరొచ్చిందో, అలాగే ఈ సినిమాకీ వస్తుంది' అని తెలిపారు. 'మన ఫ్రెండ్ చెడ్డోడైనా, మంచోడైనా చివరి వరకు వదలొద్దు అనేది మెయిన్ కథ. మా సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది' అని దర్శకుడు చెప్పారు.
అదితిరావ్ హైదరి మాట్లాడుతూ, 'ఫీమేల్ సెంట్రిక్గా రాసిన కథలో నటించడం ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది. ఇందులో 'మహా' పాత్రను దర్శకుడు ఎంత గొప్పగా రాశారో, అంతే గొప్పగా తెరకెక్కించారు' అని తెలిపారు. సిద్దార్థ్ మాట్లాడుతూ. 'ఇది ఐకానిక్ సినిమాల లిస్ట్లో చేరే సినిమా. ఈ సినిమాతో నాకు కొత్త ఇమేజ్ని అజరు భూపతి క్రియేట్ చేశాడు. థియేటర్స్కి మా సినిమా వస్తోందని గర్వంగా చెబుతున్నాం' అని అన్నారు.