Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సప్తగిరి కథానాయకుడిగా ఓ సినిమా రూపొందనుంది. దీనికి 'యజ్ఞం', 'పిల్లా... నువ్వు లేని జీవితం' వంటి విజయవంతమైన సినిమాలు తీసిన ఎ.ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. రిగ్వేద క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్1గా ఎ.ఎస్.రిగ్వేద చౌదరి నిర్మించనున్నారు. ఫిబ్రవరి ద్వితీయార్థంలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, 'వినూత్న కథాంశంతో రూపొందిస్తున్న చిత్రమిది. సప్తగిరి నుంచి ప్రేక్షకులు ఆశించే వినోదంతో పాటు కొత్త కథ, కథనాలు ఉంటాయి. రవికుమార్ చౌదరి దర్శకత్వం సినిమాకు బలం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చేస్తాం' అని అన్నారు.
ఈ చిత్రానికి కూర్పు: గౌతం రాజు, పోరాటాలు: రామ్ - లక్ష్మణ్, ఛాయాగ్రహణం: సిద్ధం మనోహర్, కళ: రమణ వంక, పాటలు: సుద్దాల అశోక్ తేజ, కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని, సహ నిర్మాత: దేవినేని రవి, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: ఎ.ఎస్.రవికుమార్ చౌదరి.