Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఆంధ్రుడు', 'పెదబాబు', 'అతడు', 'లెజెండ్' సహా దాదాపు నలభై చిత్రాల్లో బాలనటుడుగా అలరించిన దీపక్ సరోజ్ 'వందనం' చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. ఇటీవల ఆస్కార్ అవార్డు ఎంట్రీ సాధించిన 'మిణుగురులు' చిత్రంలో లీడ్రోల్లో నటించిన దీపక్, రాజేంద్రప్రసాద్ ప్రధానపాత్రలో నటించిన 'టామీ' చిత్రంలో కూడా కీలకపాత్రలో నటించారు. వైజాగ్ సత్యానంద్ వద్ద శిక్షణ తీసుకున్న తొలి బాలనటుడు కూడా దీపక్ కావడం విశేషం. డిఫరెంట్ లవ్సబ్జెక్ట్తో రూపొందనున్న 'వందనం' చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకుల పరిచయం అవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,'ఇదొక డిఫరెంట్ లవ్ స్టోరీ. ఇంతవరకు తెలుగు స్క్రీన్ మీద రానటువంటి కథ ఇది. ఆద్యంతం వైవిధ్యంగా ఉంటూ అందర్నీ అలరించే విధంగా ఈ చిత్రం ఉంటుంది. మరిన్ని మంచి చిత్రాల్లో హీరోగా నటించేందుకు ఈ సినిమా దోహదపడుతుంది' అని అన్నారు.