Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డ్రీమ్ మర్చంట్స్ బ్యానర్పై జ్ఞానసాగర్ దర్శకత్వంలో పర్వీణ్ రాజ్ను హీరోగా పరిచయం చేస్తూ యమున కిషోర్, జగదీష్ కుమార్ కాళ్లురి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'ప్లేయర్'. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ, 'సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి 'యు/ఎ' సర్టిఫికేట్ ఇస్తూ సినిమా బాగుందని ప్రశంసించారు. మా డ్రీమ్ మర్చెంట్ ప్రొడక్షన్ నుంచి వచ్చే సినిమాలు క్వాలిటీతో ఉంటాయి. ఆ క్వాలిటీతో పాటు రిచ్నెస్ కోసం ఈ చిత్రాన్ని ఎక్కువ భాగం బ్యాంకాక్లో షూటింగ్ చేశాం. యూత్ని ఆకట్టుకునే కథ ఇది. ఇలాంటి కథ ఇప్పటి వరకు తెలుగులో ఒక్క సినిమా కూడా రాలేదు. విజువల్గా ఆకట్టుకుంటుంది. దర్శకుడనుకున్న మంచి పాయింట్కు తగ్గట్టుగా అందంగా నిర్మించాం. సీనియర్ నటుడు నాగినీడుతో సమానంగా హీరో పర్వీణ్ రాజ్ నటించాడు. తల్లి పాత్రలో నటించిన సీతతో కలిసి సెంటిమెంట్ సన్నివేశాల్లో కూడా బాగా మెప్పించాడు. భవిష్యత్లో మంచి నటుడిగా పేరు తెచ్చుకుంటారు. మా సంస్థ నుంచి ప్రతిభ గల దర్శకుడు జ్ఞానసాగర్ ను పరిచయం చేస్తున్నం దుకు సంతోషంగా ఉంది. సురేష్ కెమెరా పనితనం సినిమాకు బాగా హైలైట్ అవుతుంది. సంగీత దర్శకుడు రజీష్ రఘునాథ్ ఈ చిత్రానికి ఉత్కంఠభరితమైన బ్యాక్గ్రౌడ్ స్కోర్ను అందించారు' అని అన్నారు. ఈ చిత్రానికి ఎడిటర్: వినరు రామస్వామి.